పేలిన యుద్ధట్యాంకు గొట్టం

భారత సైన్యానికి చెందిన టి-90 యుద్ధట్యాంకు గొట్టం పేలి ఇద్దరు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్‌కు గాయాలయ్యాయి.

Published : 08 Oct 2022 04:24 IST

యూపీలో ఇద్దరు సైనిక సిబ్బంది దుర్మరణం

దిల్లీ: భారత సైన్యానికి చెందిన టి-90 యుద్ధట్యాంకు గొట్టం పేలి ఇద్దరు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బబీనా ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో కాల్పుల అభ్యాసాలు జరుగుతున్నాయి. పేలుడు సంభవించినప్పుడు ట్యాంకులో కమాండర్‌, గన్నర్‌, డ్రైవర్‌ ఉన్నారు. ఈ ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన బబీనాలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కమాండర్‌, గన్నర్‌ చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సైనిక ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని