Girl Suicide: కాబోయే వాడు మోసం చేశాడంటూ.. యువతి ఆత్మహత్య

కర్నూల్‌లోని ఇందిరాగాంధీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వరుడు మరో పెళ్లి చేసుకున్నాడని పద్మావతి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

Updated : 05 Jun 2023 10:14 IST

కర్నూలు నేరవిభాగం: కర్నూలులోని ఇందిరాగాంధీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తనతో నిశ్చితార్థమైన యువకుడు మరో పెళ్లి చేసుకున్నాడని పద్మావతి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 9న పద్మావతికి నంద్యాల జిల్లా నందికొట్కూర్‌ నియోజకవర్గం పాతకోటకు చెందిన వినోద్‌ కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 10న వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. అయితే వినోద్‌ మరో పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో మనస్తాపానికి గురైన పద్మావతి.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని