TS News: చంద్రగొండవద్ద రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి.. 8 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..

Updated : 28 Jan 2022 12:48 IST

చంద్రగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సుజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లె మండలానికి వరినారు తీసేందుకు బొలేరో వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో తిప్పనపల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్‌ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు కత్తి స్వాతి (27), సుజాత (40) అక్కడికక్కడే మృతి చెందగా.. మొత్తం పది మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుర్రం లక్ష్మి(52), సాయమ్మ(42) మృతిచెందారు. సమాచారం అందుకున్న కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ నాగరాజులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని