Chittoor: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళల మృతి

చిత్తూరు జిల్లా చర్లోపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 02 Nov 2023 20:43 IST

చిత్తూరు నగరం: చిత్తూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. చెర్లోపల్లి వద్ద డివైడర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్‌ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి మైసూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని