Zaheerabad: భర్త మరణం తట్టుకోలేక బావిలో దూకిన భార్య

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం కాశింపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణం తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

Published : 31 Dec 2023 15:53 IST

జహీరాబాద్‌ అర్బన్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం కాశింపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణం తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన మహాదేవి(35) భర్త శేఖర్‌ 3 నెలల క్రితం మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక శనివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన భార్య మహాదేవి గ్రామ సమీపంలోని వ్యవయసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న చిరాగ్‌పల్లి పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి జహీరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ కలహాలతో మరో వ్యక్తి

కాశింపూర్‌ గ్రామానికే చెందిన నర్సింహులు (40) మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవపడి తెల్లవారు జామున బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నర్సింహులు దూకిన బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని