Noida: ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టిన భార్య
ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పూడ్చేసింది.
నోయిడా: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే నిర్మాణ దశలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పూడ్చేసింది. ఈ దారుణ ఘటన నోయిడా(Noida)లో చోటు చేసుకుంది. జనవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఉత్తర్ప్రదేశ్(UP)లోని బులంద్ శహర్కు చెందిన సతీష్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం భార్య నీతూ, ఐదేళ్ల కుమారుడితో కలిసి కలిసి నొయిడాకు వచ్చేశాడు. స్థానిక సరస్వతి కుంజ్లో సొంతింటిని నిర్మించుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం తాపీ మేస్త్రీ హర్పాల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని రోజులు గడిచే సరికి సతీశ్ భార్యతో తాపీ మేస్త్రీకి అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రియుడిపై మోజుతో నీతూ తన భర్తను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి అతడిని హతమార్చేందుకు పథకం పన్నింది. జనవరి2న భర్త మద్యం మత్తులో ఉండడంతో ప్రియుడితో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరూ పక్కనే నిర్మాణ దశలో ఉన్న సెప్టింగ్ ట్యాంకులో శవాన్ని పూడ్చేసి ప్లాస్టరింగ్ చేసేశారు. అయితే, తన సోదరుడు కనిపించడం లేదంటూ సతీష్ సోదరుడు ఈ నెల 10 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు అనుమానం వచ్చి సతీష్ భార్యను ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడి కూపీ లాగారు. మృతుడి భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నోయిడా అదనపు డీసీపీ విశాల్ పాండే వెల్లడించారు. మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?