Crime News: ఓర్వకల్లులో దారుణం.. గొంతు కోసి.. రాళ్లతో తలపై మోది తోడికోడళ్ల దారుణహత్య
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు తోడికోడళ్లను దారుణంగా హత్య చేశారు.
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన తోడికోడళ్లు రేణుక(21), రామేశ్వరి(26) దారుణహత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దరామ గోవిందు, చిన్నరామ గోవిందు ఇద్దరు అన్నదమ్ములు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దరామ గోవిందు భార్య రామేశ్వరి, చిన్నరామ గోవిందు భార్య రేణుక కలిసి పశువుల మేత కోసం గ్రామ సమీపంలోని ఓ పొలంలో పశుగ్రాసం కోసేందుకు వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిపై దాడి చేశారు. వారిద్దరి గొంతు కోసి రాళ్లతో తలపై బాది ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు.
ఎంతసేపటికీ వారు ఇంటికి రాకపోవడంతో సోదరులిద్దరూ ఇవాళ సాయంత్రం 6గంటలకు పొలం వద్దకు వెళ్లి చూశారు. రామేశ్వరి, రేణుక రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యారు. సోదరులిద్దరూ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దిశ డీఎస్పీ వెంకటరామయ్య, కర్నూలు గ్రామీణ సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఎస్సై మల్లికార్జున ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీసు హోంగార్డు తాను పనిచేస్తోన్న పోలీస్స్టేషన్లోనే రూ.5.6లక్షలు కాజేశాడు. -
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ ధ్రుడంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?