వైకాపా మద్దతుదారు ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం శివపురం పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వైకాపా మద్దతుదారు మంజుల పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ..

Updated : 05 Feb 2021 02:27 IST

కనగానపల్లె: అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం శివపురం పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వైకాపా మద్దతుదారు మంజుల పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వైకాపా మద్దతుతో ఈనెల 2న మంజుల నామినేషన్‌ దాఖలు చేయగా.. ఇవాళ మరో మహిళతో నామినేషన్‌ వేయించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని