మినీ ఆడిటోరియంపై చిగురిస్తున్న ఆశలు
ఆదిలాబాద్ పురపాలక సంఘ పరిధిలో మినీ ఆడిటోరియం అందుబాటులోకి రానుంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. పట్టణంలోని కైలాస్నర్ కాలనీలో ఆడిటోరియం నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టారు.
రూ. 5 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కసరత్తు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
ఆదిలాబాద్లోని మినీ ఆడిటోరియం కోసం ఎంపిక చేసిన స్థలంలో భవనాలు కూల్చివేసి చదును చేసి..
ఆదిలాబాద్ పురపాలక సంఘ పరిధిలో మినీ ఆడిటోరియం అందుబాటులోకి రానుంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. పట్టణంలోని కైలాస్నర్ కాలనీలో ఆడిటోరియం నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టారు. ఇప్పటికే అక్కడున్న అధికారుల నివాస గృహాలు(వైట్ క్వార్టర్స్)ను కూల్చివేసి చదును చేశారు. చెట్లు ఉండటంతో వాటిని తొలగించేందుకు అనుమతులు తీసుకోనున్నారు. త్వరలోనే ఇక్కడ భవనం నిర్మించేందుకు అధికారులు కసరత్తు ఆరంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించేందుకు సౌలభ్యంగా ఉండే ఆడిటోరియం కావాలని చాలాకాలంగా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో మరింత డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం సంఘ భవనాలు, ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఉంటే అందరికి ఉపయోగపడనుందనే అందరి వాదన. అధికారిక కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగ పడనుంది. రిమ్స్లో ఆడిటోరియం ఉన్నా అది కళాశాలకే పరిమితమవుతోంది. ఇతర కార్యక్రమాలకు ఇచ్చేందుకు వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకనే అందరికి ఉపయోగడపేలా ప్రభుత్వ పరంగా భవనం ఉంటే తక్కువ ధరతోనూ ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించేందుకు సైతం వినియోగించుకునే అవకాశం ఉంది.
నాలుగేళ్ల కిందటే రూ.5 కోట్లు మంజూరు
ప్రజల కోరిక మేరకు జిల్లా కేంద్రంలో మినీ ఆడిటోరియం నిర్మాణం కోసం ఎమ్మెల్యే జోగురామన్న మంత్రిగా ఉన్న సమయంలోనే రూ.5 కోట్లు మంజూరు చేయించారు. తొలుత శాంతినగర్లోని బాలుర డిగ్రీ కళాశాల వెనుకాల ఉన్న 4 ఎకరాల మైదానంలో నిర్మించేందుకు నిర్ణయించారు. టెండర్లను ఆహ్వానించారు. అక్కడ కళాశాలలో కొత్త కోర్సుల మంజూరు, భవిష్యత్తులో అటానమస్ విశ్వవిద్యాలయం మంజూరుకు అవకాశాలు ఉండటంతో కళాశాలకే స్థలం అవసరముంటుందని ‘ఈనాడు’లో కథనం రావడంతో పనులు ప్రారంభించక ముందే ఆపివేశారు.
1.25 ఎకరాల సేకరణ
ఊరి చివర కాకుండా పట్టణ నడిబొడ్డున నిర్మించాల్సి ఉండడంతో స్థల సేకరణ కష్టమైంది. అందుకనే ఇన్ని రోజులు జాప్యమవుతూ వచ్చింది. చివరకు కైలాస్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుకాల 1.25 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ అధికారులకు కేటాయించిన పాత నివాసాలు ఉండటంతో ఇటీవలే పుర అధికారులు వాటిని కూల్చివేసి చదునుచేశారు.
పాత టెండర్లు రద్దు : అరుణ్, పురపాలక, ఇంజినీర్
గతంలో మినీ ఆడిటోరియంకోసం టెండర్లు నిర్వహించాం. 6 నెలల్లోగా సంబంధిత గుత్తేదారుతో అగ్రిమెంట్ చేసుకొని స్థలం అప్పగించాల్సి ఉండగా అది జరగలేదు. నిబంధనల మేరకు ఆ టెండర్ రద్దు అయింది. కొత్త ధర మేరకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.