కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ
జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హనుమకొండకు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది.
కొత్త పాలనాధికారి రాహుల్రాజ్ జిల్లావాసులకు పరిచితమే
ఆదిలాబాద్ పాలనాప్రాంగణం, న్యూస్టుడే
జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హనుమకొండకు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. ఆమె స్థానంలో కుమురం భీం జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాహుల్రాజ్ ఇక్కడికి వస్తున్నారు.
మంగళవారం విద్యానగర్ పాఠశాలలో మన ఊరు మన బడి పనులు
తనిఖీ చేసి వెళుతున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్
సమీక్షలతో తనదైన ముద్ర..
బదిలీపై వెళ్తున్న పాలనాధికారి సిక్తా పట్నాయక్ 2020 జులై 17న అప్పటి పాలనాధికారి శ్రీదేవసేన నుంచి బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా రెండు సంవత్సరాల 4 నెలల 15 రోజులు పని చేశారు. కరోనాసమయంలో విధుల్లో చేరడంతో ఏడాదిపాటు ప్రజలతో మమేకం కాలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ సమీక్షలతో పనులు వేగవంతం చేసినా.. గాడితప్పిన అధికారులను, ఉద్యోగులను మందలించడంలో మెతక వైఖరి ప్రదర్శించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పల్లె ప్రగతి మొదలుకొని.. తాజాగా అమలవుతున్న ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం వరకూ రాష్ట్రస్థాయిలో మంచి పనితీరు కనబరిచారు. మాతాశిశు మరణాలను అరికట్టడంలో కొంతవరకు సఫలీకృతులయ్యారు. శాంతిభద్రతల విషయంలో జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో, దేశంలో అయిదో స్థానంలో నిలవడం సాధ్యమైంది. కరోనా వల్ల పాలనాప్రాంగణ ఆవరణలో జాతీయజెండా ఎగురవేసిన పాలనాధికారిగా ఘనత దక్కించుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు మినహా.. ప్రజల మన్ననలు పొందడంలో తనదైన ముద్ర వేయలేకపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. నూతన సంవత్సర వేళ పుష్పగుచ్ఛాలు బదులు పేదలకు ఉపయోగపడేలా నోటుపుస్తకాలు, దుప్పట్లు వంటివి తీసుకురావాలని పిలుపునిచ్చి అందరిలో స్ఫూర్తినింపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా పాలనాధికారి తీరుపై అసహనం వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సామాన్యుల సమస్యల నివేదనకు వేదికైన ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించకపోవడం.. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు కూడా సంక్షేమ పథకాల అమలును పరిశీలించారే తప్ప ప్రజా అర్జీలను అంతగా పట్టించుకోలేదనే అపవాదును మూట్టగట్టుకున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనా సామాన్యులపై కబ్జా రాయుళ్లు జులుం ప్రదర్శించినా కఠినంగా వ్యహరించలేపోయారనే విమర్శలు ఉన్నాయి.
సాఫ్ట్వేర్ కొలువు నుంచి ఐఏఎస్గా..
పేరు : పీఎస్.రాహుల్రాజ్
స్వస్థలం : హైదరాబాద్
భార్య : శ్రీజ, కెనరాబ్యాంకు ఉద్యోగి
పిల్లలు : రితిక, నిర్విక
విద్యాభ్యాసం : హైదరాబాద్
విద్యార్హత : బీటెక్(2005-2009)
తొలి ఉద్యోగం : టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీరు
ఐఏఎస్గా ఎంపిక : 2015 బ్యాచ్, 375 ర్యాంకు
పోస్టింగ్లు : 2016లో నిజామాబాద్ సహాయ కలెక్టర్, 2017లో సహాయ కార్యదర్శి(కేంద్ర సర్వీసులో), 2018-20 జనవరి వరకు బెల్లంపల్లి సబ్కలెక్టర్, 2020 జనవరి నుంచి హైదరాబాద్ జీహెచ్ఎంసీ అదనపు కమిషనరు, 2020 నవంబర్ 9 నుంచి కుమురం భీం కలెక్టర్
అభిరుచులు : టీచింగ్, క్రికెట్ చూడటం, గార్డెనింగ్
రాహుల్ రాజముద్ర వేసేనా?
సిక్తా పట్నాయక్ 2021 జులై 7 నుంచి జూన్ 4 వరకు 59 రోజులు ప్రసూతి సెలవులో వెళ్లినపుడు రాహుల్ రాజ్ జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కరోనా సమయం కావడంతో తనదైన ముద్ర వేయలేకపోయారు. ప్రజావాణి విభాగాన్ని పకడ్బందీగా నిర్వహించి, క్షేత్రస్థాయి పర్యటనలతో జిల్లాయంత్రాంగంలో జవాబుదారీతనం పెంచుతారని, రెవెన్యూ, వైద్య, విద్యావ్యవస్థలను గాడిపెడతారని ఇపుడు జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. భూకబ్జాలపై ఉక్కుపాదం మోపాలని, సామాన్యులకు అండగా నిలబడాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.