Telangana Elections: ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడమంటే ఏంటో తెలుసా?
‘ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా తిరిగి రావు.’ ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తరచూ చేస్తున్న వ్యాఖ్యలివి.
అది దక్కితేనే అభ్యర్థులకు గౌరవప్రద ఓటమి
ఆదిలాబాద్ అర్బన్, లక్షెట్టిపేట న్యూస్టుడే: ‘ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా తిరిగి రావు.’ ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తరచూ చేస్తున్న వ్యాఖ్యలివి. ఫలితాలు వెలువడిన అనంతరం అభ్యర్థులకు తమ ధరావతు డబ్బులు తిరిగి వస్తే అది గౌరవప్రదమైన ఓటమిగా భావిస్తారు. ఆ డబ్బులు తిరిగి రాకపోతే అభ్యర్థి చిత్తుగా ఓడిపోయినట్లే. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 1569 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 252 మంది తమ ధరావతును తిరిగి పొందారు. నేటినుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో అసలు ధరావతు అంటే ఏమిటి? అభ్యర్థులు డబ్బులను రిటర్నింగ్ అధికారి వద్ద ఎందుకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
నామపత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్థుల వ్యక్తిగత వివరాల పరిశీలన, ధ్రువీకరణ, ఈవీఎంలపై గుర్తుల కేటాయింపు, సర్వీస్ ఓటర్లకు బ్యాలెట్ పేపర్లపై గుర్తులను ముద్రించడం వంటి ప్రతి అంశంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన ప్రచార ఖర్చులు, ప్రతి కదలికపై ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందాలు నిశిత పరిశీలన చేస్తాయి. అభ్యర్థులు ఏదో తమాషాకు పోటీ చేస్తే ఎన్నికల సంఘానికి అనవసర ఖర్చు పెరగడంతోపాటు అధికారుల విలువైన సమయం వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థుల నుంచి షరతులతో కూడిన తిరిగిచెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను స్వీకరిస్తోంది.
ఆర్ఓ వద్ద..
ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికలకు రూ.10 వేలు ధరావతు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం అందులో సగం(రూ.5 వేలు) చెల్లిస్తే సరిపోతుంది. నామపత్రం దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఆర్ఓ ఆ మొత్తాన్ని ఖజానా శాఖలో తెరచిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు.
ఆరోవంతు ఓట్లు సాధిస్తేనే..
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను సాధించాల్సి ఉంటుంది. అంటే 16 శాతానికి పైగా ఓట్లు వస్తేనే అభ్యర్థికి ఫలితాలు వెలువడిన అనంతరం రిటర్నింగ్ అధికారి ధరావతును తిరిగి ఇస్తారు. లేనిపక్షంలో ఆ డబ్బులను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో 107 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 80 మంది ధరావతు కోల్పోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 123 మంది పోటీ పడితే 100 మంది అభ్యర్థులకు డిపాజిట్లు తిరిగి రాలేదు. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా డిపాజిట్లను కోల్పోవడం సర్వసాధారణం. అయితే గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సైతం ధరావతును కోల్పోయే తీర్పును ఇవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన