విడిచి ఉండలేక.. కలిసి బతకలేక
వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో సంతోషించారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని.. అన్యోన్యంగా జీవించాలని ఆశపడ్డారు
ఉరేసుకుని ప్రియురాలు.. పురుగుమందు తాగి ప్రియుడి ఆత్మహత్య
మందమర్రి పట్టణం, నెన్నెల న్యూస్టుడే: వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో సంతోషించారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని.. అన్యోన్యంగా జీవించాలని ఆశపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రియుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన తీగుళ్ల భగవాన్(23), మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీత(21)ల మధ్య పాఠశాల స్థాయిలోనే ప్రేమ చిగురించింది. ఆమె రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. భగవాన్ డీసీఎం వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. బుధవారం ఉదయం తన అక్క కొడుకు చిన్నారి వియాన్ష్కు భోజనం తినిపించే విషయమై సంగీత చిరాకు పడింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అనంతరం కూలీ పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎవరితోనో ఫోన్ మాట్లాడిన ఆమె ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చి చూసిన బంధువులు అచేతన స్థితిలో ఉన్న సంగీతను చూసి కిందికి దించారు. వెంటనే మందమర్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. భగవాన్ డీసీఎం వ్యాన్లో పత్తిలోడును కుమురంభీం జిల్లా రేపల్లివాడ జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యాడు. బెల్లంపల్లికి చేరుకోగానే సంగీత మృతి చెందిన విషయం తెలిసింది. వెంటనే పురుగుమందు కొనుగోలు చేసి బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న సోదరుడు భరత్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దారి వెంట వెతుకుతూ వెళ్లగా రహదారిపై వ్యాన్ కనిపించింది. పక్కనే ఉన్న మామిడితోటలో అపస్మారక స్థితిలో భగవాన్ కనిపించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అదే డీసీఎం వ్యాన్లో తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు చెప్పారు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భగవాన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాళ్లగురిజాల ఎస్సై నరేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చోరీ కేసులో నేరస్తునికి రెండు నెలల జైలు
[ 17-05-2024]
దొంగతనం చేసిన కేసులో నేరస్తునికి రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ పీసీఆర్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి శుక్రవారం తీర్పునిచ్చారు. -
లక్ష గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
[ 17-05-2024]
జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. -
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ దుర్మరణం
[ 17-05-2024]
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని మావల సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. -
వానొస్తే.. వణుకే...
[ 17-05-2024]
ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నను అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. -
సరిహద్దు ప్రజలు.. చైతన్య వారధులు
[ 17-05-2024]
జిల్లా సరిహద్దు గ్రామాల్లో పల్లెవాసులు ఓటు చైతన్యం ప్రదర్శించారు. అయిదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గినా.. గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. -
ఈదురుగాలుల బీభత్సం
[ 17-05-2024]
గుడిహత్నూర్, డొంగ్రగావ్, మన్నూర్, తోషం, కొల్హారి పంచాయతీల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
రుణమాఫీకి కసరత్తు
[ 17-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
స్కాన్ చెయ్.. కథలు చదివేయ్!
[ 17-05-2024]
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పఠనా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ లిటరసీ క్లౌడ్ వెబ్సైట్ను రూపొందించింది. -
వెక్కిరిస్తున్న ఖాళీలు
[ 17-05-2024]
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయాన్ని అర్చకులు, ఉద్యోగుల ఖాళీలు వేధిస్తున్నాయి. -
ఇక ఓపీ సేవలు సులభం
[ 17-05-2024]
జనరల్ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. -
పడిపోతున్న భూగర్భ జలాలు
[ 17-05-2024]
ఎప్పుడూ లేనంతగా ఈ వేసవిలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు ఠారెత్తించాయి. -
టీకా లెక్క.. తేలేదెట్టా..!
[ 17-05-2024]
జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలోని భార్యాభర్తలు తమ ఏడాదిన్నర చిన్నారికి ఇచ్చే టీకాకు సంబంధించి ఆరోగ్య సిబ్బందిని సంప్రదించారు. -
గతమెంతో ఘనం.. నేడు దైన్యం!
[ 17-05-2024]
గతంలో గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో జిల్లాలోనే కౌటాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముందుండేది. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 17-05-2024]
ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నరకం వడ్లకే బోనస్ అంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. -
రెండు వాహనాలు ఢీ
[ 17-05-2024]
రెండు వాహనాలు ఢీకొనగా పలువురికి గాయాలైన ఘటన జాతీయ రహదారి 61పై మండలంలోని తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. -
నిరంతర సరఫరాకు పకడ్బందీ చర్యలు
[ 17-05-2024]
‘జిల్లాలో నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ