logo

భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

జిల్లాలో శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated : 29 Mar 2024 16:24 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లాలో శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్ గ్రంథాన్ని పఠించారు. ఏసుక్రీస్తు శిలువపై మరణించక ముందు ప్రజలకు చెప్పిన ఏడు మాటలను ఫాదర్లు, పాస్టర్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ క్యాథడ్రల్ చర్చిలో క్రైస్తవులు శిలువ యాత్రను నిర్వహించారు. సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు శిలువ చేతపట్టుకుని ఏసు గీతాలను ఆలపిస్తూ యాత్రలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని