రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఆర్వోకు నామపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, చిత్రంలో కంది శ్రీనివాస్రెడ్డి, గజేందర్
పాలనాప్రాంగణం, న్యూస్టుడే : లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. ఆయన వెంట ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జులు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, నాయకులు సయ్యద్ కరీం, శ్రీలేఖ ఉన్నారు. ఇప్పటి వరకు దాఖలైన నామపత్రాల సంఖ్య మూడుకు చేరుకుంది.
పేదింటి బిడ్డను ఆదరించండి : ఎమ్మెల్యే
ఆత్రం సుగుణ పేదింటి బిడ్డని, ఆమెను ఆదరించి పార్లమెంటుకు పంపాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రజలను కోరారు. నామపత్రం దాఖలుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, పోరాటాల్లో పాల్గొన్న మహిళగా గుర్తింపు ఉన్న సుగుణకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. అయిదు న్యాయసూత్రాలు, ఆరు గ్యారెంటీల అమలు లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానం కాంగ్రెస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కమిటీ జిల్లా అధ్యక్షులు షాహిద్ అహ్మద్ ... -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.