logo

జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు

జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షట్కర్ భారీ మెజారటీ తో గెలవబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు.

Published : 30 Apr 2024 17:23 IST

ఎల్లారెడ్డి పట్టణం: జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షట్కర్ భారీ మెజారటీ తో గెలవబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతుందని, రాముడు అందరికి దేవుడని అన్నారు. గత పదేళ్లుగా ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఎప్పడూ ఆలోచించలేదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిబాబా, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని