ఆత్మీయ సమ్మేళనాలకే ప్రాధాన్యం
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేస్తారు.
అన్ని వర్గాల ఓట్ల కోసం అభ్యర్థుల ప్రచారం
నిర్మల్, న్యూస్టుడే: ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. పైగా ఎండలు మండిపోతున్న తరుణంలో ఓటర్లందరినీ కలవడం కత్తి మీద సామే. ఈ క్రమంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. పట్టణాలు, గ్రామాల్లోని మత పెద్దలు, సామాజిక వర్గాలు, యువజన సంఘాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో తమ పార్టీ చేసిన పనులు, గెలిపిస్తే ఏం చేయాలనుకున్నామో వివరిస్తున్నారు. అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నాయకులు హాజరవుతున్నారు. తెల్లవారుజామున వాకర్లతో మాటామంతితో మొదలయ్యే ఈ సమావేశాలు.. రాత్రి వేళ కాలనీల్లో అందరినీ కలిసేవరకు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు ఆకర్షించడమే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గ ఓటర్లే గెలుపు ఓటములు శాసించేస్థాయి ఉండటంతో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారి ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు చేయడంలో నిమగ్నమయ్యారు.
మద్దతు కోసం ప్రయత్నాలు
ఎన్నికల వేళ చోటా నాయకులే అభ్యర్థులకు అండగా ఉంటున్నారు. బూత్స్థాయిలో ఎవరికి ఓటేయగలరో చెప్పే వీరంతా ఓటరు జాబితా పట్టుకున్న టిక్కులు పెడుతున్నారు. అలా టిక్కులు పెట్టి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఆయా వర్గాల మద్దతు కూడగడుతున్నారు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా పార్టీల అభ్యర్థులకు సమాచారం ఇచ్చి వారు హాజరయ్యేలా చూస్తున్నారు. ఇలా వందలాది మంది ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ప్రధానంగా సామాజిక వర్గాలపైనే దృష్టి సారించి వారి ఓట్లను గంపగుత్తగా పొందడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వారి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితా వెల్లడి కావడంతో ప్రధాన పార్టీలు ప్రచార పర్వం జోరు పెంచారు. ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో అంతటా రాజకీయ వే‘ఢీ’ మొదలైంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కలిసిన వారిని పలకరిస్తూ మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. భాజపా అభ్యర్థి గోడం నగేశ్, భారాస అభ్యర్థి ఆత్ర సక్కు, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మంగళవారం నిర్మల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హనుమాన్ ఆలయంలో హుండీ చోరీ
[ 21-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీ సమీపంలో గల ఆదర్శ్ నగర్ హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి సమయంలో ఆగంతకుడు చొరబడి హుండీలోని నగదు చోరీ చేశాడు. -
సాధారణ బోగీల పెంపు కోసం ఉత్తరాల ఉద్యమం
[ 21-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు ఐదుకు పెంచాలంటూ 'ఐదు సాధారణ భోగీల సాధన సమితి' ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు. -
పీసీ పీఎన్డీటీ బృందం ఏర్పాటు
[ 21-05-2024]
ప్రైవేట్ ఆసుపత్రుల్లో భ్రూణ, లింగ నిర్ధారణ చేయకుండా అడ్డుకట్ట వేయటానికి పీసీ పీఎన్డీటీ చట్టం 1994 ను పగడ్బందీగా అమలు చేయడానికి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. -
బుధవారం శ్రీనివాస స్వామి కళ్యాణం
[ 21-05-2024]
జిల్లా కేంద్రం మంగ మఠంలోని శ్రీ రమా సత్యనారాయణ దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు. -
ఘనంగా రాజీవ్ వర్ధంతి
[ 21-05-2024]
పట్టణంలోని ప్రజా సేవాభవన్లో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 21-05-2024]
రైతులు కోరిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తత్రి డిమాండ్ చేశారు. -
అర్హత లేకున్నా.. చికిత్స..!
[ 21-05-2024]
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
[ 21-05-2024]
కోటపల్లి మండలంలోని ప్రాణహిత తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని బాగు చేయడంలో మూడేళ్లుగా నిర్లక్ష్యం వెంటాడుతోంది. -
తరుగు పేరిట దోపిడీ
[ 21-05-2024]
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
అధికార్ల మెలిక.. అన్నదాత తికమక
[ 21-05-2024]
వానాకాలం పంటల సాగు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు రైతులు భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అటవీహక్కు పత్రాలు కలిగిన భూముల్లో ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు -
ఎమ్మెల్యే హరీశ్బాబును అడ్డుకున్న పోలీసులు
[ 21-05-2024]
జైనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఓ వర్గం సభ్యులు గాయపడిన విషయం విదితమే. -
తోటి మిత్రులే హంతకులై.!
[ 21-05-2024]
మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. -
రూ. 47 లక్షల విక్రయాలకు లెక్కల్లేవ్!
[ 21-05-2024]
రైతులకు రుణాలు అందించి సకాలంలో ఎరువులను సరఫరా చేసి అండగా నిలవాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు అస్తవ్యస్త నిర్వహణతో గాడి తప్పుతున్నాయి. -
తడబడితే తప్పదు మూల్యం
[ 21-05-2024]
విద్యాసంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. -
సర్కారు బడులు.. చకచకా పనులు
[ 21-05-2024]
భీంపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రహరీ, టాయిలెట్లు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మరమ్మతులతోపాటు తాగునీటి సౌకర్యం కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు -
రెండేళ్లుగా ఎదురుచూపులే
[ 21-05-2024]
తాంసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2023లో కేంద్ర బృందం సందర్శించింది. రోగులకు ఉత్తమ వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలు తదితర విషయాల్లో అత్యుత్తమ పనితీరుతో ఎన్క్వాస్కు ఎంపిక చేశారు. -
విత్తన గుట్టు విప్పండి..
[ 21-05-2024]
‘‘ మీరు కోరుకున్న కంపెనీ విత్తన సంచి కావాలంటే మేం చెప్పే మరో కంపెనీకి చెందిన రెండు విత్తన సంచులు కొనాలి. లేనట్లయితే మీరు చెప్పే విత్తనాలు ఇవ్వటం కుదరదు. -
మానవతావాదులు స్పందించారు..
[ 21-05-2024]
బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్ జాడే చికిత్స నిమిత్తం మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!