ఆడబిడ్డగా ఆదరించండి
ఆడబిడ్డగా మీ చెంతకు వచ్చా..కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను ఆదరించండి అయిదేళ్లు అండగా ఉంటా అంటూ ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
స్వర్ణలో కొంగు చాచి ఓట్లు ఆభ్యర్థిస్తున్న ఆత్రం సుగుణ, చిత్రంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు
సారంగాపూర్, న్యూస్టుడే: ఆడబిడ్డగా మీ చెంతకు వచ్చా..కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను ఆదరించండి అయిదేళ్లు అండగా ఉంటా అంటూ ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. మంగళవారం సారంగాపూర్ మండలం ధని, సాయినగర్, బోరిగాం, జామ్, స్వర్ణ, చించోలి(ఎం) గ్రామాల్లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జరిగే ప్రాంతాలను సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఏ పార్టీ ఇంత వరకు చేయలేని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందడుగువేసి మహిళనైనా తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. పదేళ్ల చొప్పున భారాస, భాజపాలకు మీరు అవకాశం కల్పించారు. ఒకసారి కాంగ్రెస్ను ఆదరించండి.. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ ఆడే సవితబాయి, జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, పార్టీ కన్వీనర్ బొల్లోజి నర్సయ్య, సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, రాజ్మహ్మద్, అబ్దుల్ ఆది, మారుతి, దశరథ రాజేశ్వర్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
నర్సాపూర్(జి): మండల కేంద్రంలో మంగళవారం ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సమక్షంలో భారాస నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దిలావర్పూర్: ప్రజా సమస్యలపై పోరాటమే తన అజెండా అని ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం రాత్రి గుండంపల్లి, లోలం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఒక్కసారి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. నాయకులు విద్యాసాగర్ రెడ్డి, కె.దేవేందర్రెడ్డి, అర్గుల రమణ, కోడె విజయ్, తదితరులు పాల్గొన్నారు.
మామడ: ఇతర పార్టీలన్నీ ఎన్నికలప్పుడే పేదలపై ప్రేమ కనబరుస్తాయని ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం మండలంలోని వాస్తాపూర్, గోండుగూడ, అరెపల్లి గ్రామాల్లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి హామీని నెరవేరుస్తుందని భరోసానిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హత లేకున్నా.. చికిత్స..!
[ 21-05-2024]
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
[ 21-05-2024]
కోటపల్లి మండలంలోని ప్రాణహిత తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని బాగు చేయడంలో మూడేళ్లుగా నిర్లక్ష్యం వెంటాడుతోంది. -
తరుగు పేరిట దోపిడీ
[ 21-05-2024]
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
అధికార్ల మెలిక.. అన్నదాత తికమక
[ 21-05-2024]
వానాకాలం పంటల సాగు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు రైతులు భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అటవీహక్కు పత్రాలు కలిగిన భూముల్లో ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు -
ఎమ్మెల్యే హరీశ్బాబును అడ్డుకున్న పోలీసులు
[ 21-05-2024]
జైనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఓ వర్గం సభ్యులు గాయపడిన విషయం విదితమే. -
తోటి మిత్రులే హంతకులై.!
[ 21-05-2024]
మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. -
రూ. 47 లక్షల విక్రయాలకు లెక్కల్లేవ్!
[ 21-05-2024]
రైతులకు రుణాలు అందించి సకాలంలో ఎరువులను సరఫరా చేసి అండగా నిలవాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు అస్తవ్యస్త నిర్వహణతో గాడి తప్పుతున్నాయి. -
తడబడితే తప్పదు మూల్యం
[ 21-05-2024]
విద్యాసంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. -
సర్కారు బడులు.. చకచకా పనులు
[ 21-05-2024]
భీంపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రహరీ, టాయిలెట్లు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మరమ్మతులతోపాటు తాగునీటి సౌకర్యం కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు -
రెండేళ్లుగా ఎదురుచూపులే
[ 21-05-2024]
తాంసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2023లో కేంద్ర బృందం సందర్శించింది. రోగులకు ఉత్తమ వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలు తదితర విషయాల్లో అత్యుత్తమ పనితీరుతో ఎన్క్వాస్కు ఎంపిక చేశారు. -
విత్తన గుట్టు విప్పండి..
[ 21-05-2024]
‘‘ మీరు కోరుకున్న కంపెనీ విత్తన సంచి కావాలంటే మేం చెప్పే మరో కంపెనీకి చెందిన రెండు విత్తన సంచులు కొనాలి. లేనట్లయితే మీరు చెప్పే విత్తనాలు ఇవ్వటం కుదరదు. -
మానవతావాదులు స్పందించారు..
[ 21-05-2024]
బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్ జాడే చికిత్స నిమిత్తం మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్