ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
సర్కారీ స్థలాల కబ్జా, అక్రమ వెంచర్లతో చెలరేగుతున్న భూ మాఫియా వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
వాంకిడి వ్యవసాయ భూమిలో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్
ఈనాడు, ఆసిఫాబాద్ : సర్కారీ స్థలాల కబ్జా, అక్రమ వెంచర్లతో చెలరేగుతున్న భూ మాఫియా వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏకకాలంలో విజిలెన్స్, ఏసీబీ అధికారుల తనిఖీలతో వీరు ఠారెత్తిపోతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లూ అధికారులు, నేతల అండదండలతో ఏం చేసినా నడుస్తుందనే ధీమాతో ఉన్న వీరు.. తాజాగా పరిస్థితులు మారడంతో కొందరు నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా.. భూ క్రయ విక్రయాలతో రూ.కోట్లు దండుకున్న ఈ ముఠా సభ్యులపై విచారణ సజావుగా సాగుతుందా, అక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయా అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మాజీ సర్పంచి, ఇద్దరు మైనారిటీ నేతలు, మరో ఇద్దరు కీలక నాయకులు కలిసి బృందంగా ఏర్పడ్డారు. బీడీపీపీ భూములు, ఆబాదీ భూములను పట్టాదారుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల పడావుగా ఉన్న వాటిని మైదానాలుగా మార్చి ప్లాట్లు విక్రయించేస్తున్నారు. ఈ తరుణంలో అధికారులందరికీ చేతులు తడిపి, తమ పని కానిచ్చేశారు. ఈ అక్రమాలను ‘ఈనాడు’ వరుస కథనాలతో బహిర్గతం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. సదరు భూబకాసురులు తమ కార్యకలాపాలను వాంకిడికి సైతం విస్తరించారు. రెండు రోజుల కిందట విజిలెన్స్ అధికారులు వాంకిడి మండలంలో వీరు చేసిన భూ అక్రమాల వివరాలను రెవెన్యూ కార్యాలయం నుంచి తీసుకున్నారని సమాచారం.
కొనసాగుతున్న విచారణ...
నాలుగు వరుసల రహదారి పరిహారం విషయంలో జరిగిన అక్రమ చెల్లింపులపై ఇప్పటికే ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. అయాచితంగా లబ్ధిపొందిన వ్యక్తులు, తమకు సహకరించిన రెవెన్యూ అధికారుల ఖాతాల్లో రూ.కోటి వరకు జమ చేసిన విషయం విదితమే. రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లో ఇప్పటి వరకు భూములు కోల్పోయిన వారికి రూ.70 కోట్లు పరిహారంగా ఇచ్చారు. ఆసిఫాబాద్లో రూ.4 కోట్ల పరిహారం కుంభకోణం ఉండగా.. మిగతా చోట్ల సైతం చెల్లింపుల్లో అనేక అవకతకవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తి పరిహారం చెల్లింపుపై సమగ్ర విచారణ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
భూ సమస్యను ఆర్డీఓ కార్యాలయంలో 60:40 శాతంగా ఎలా పరిష్కరిస్తారు? మిగతా భూములను ఎందుకు సర్వే చేసి, పోజిషన్ రైతులకు చూపించలేదు. కేవలం రహదారుల పక్కనే ఉన్న భూములను మాత్రమే తీసుకుని, పట్టా పాస్ పుస్తకాలు ఎలా జారీ చేస్తారు (ఇటీవల పట్టాలు ఇతరుల పేరు మీద వచ్చాయి). వెంచర్కు అనుమతులు ఉన్నాయా, తదితర విషయాలను విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు.
వాంకిడిలో ఏం జరిగింది...
నిజాం కాలంలో వాంకిడి (కలామ్) కు చెందిన లతీఫొద్దీన్కు 12 వివిధ సర్వే నంబర్లలో 104 ఎకరాల భూమి ఉండేది. కాలక్రమేణా ఆయన ఇతర దేశాల్లో స్థిరపడి అక్కడే మృతి చెందారు. ఈ భూములను తాతల కాలం నుంచి స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. భూములన్నీ పట్టేదార్ పేరుమీద ఉండడంతో.. వారి వారసులను స్థిరాస్తి వ్యాపారి, మరో ఇద్దరు రంగంలోకి దించారు. ఆసిఫాబాద్ ఆర్డీఓ వద్దకు ఈ సమస్య వెళ్లగా.. ఆయన 60:40 శాతంగా భూములను పట్టేదారు, కాస్తు చేస్తున్న యజమానులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో స్థిరాస్తి, వ్యాపారి స్థానిక రాజకీయ నేత వాంకిడి సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలను రెండు ఎకరాల చొప్పున 60:40 ఒప్పందంలో భాగంగా తీసుకున్నారు. మిగతా భూములను సర్వే చేయలేదు. స్థిరాస్తి వ్యాపారి ఈ భూమిని మరో నేతకు విక్రయించడంతో అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతోంది. 59 సర్వే నంబర్లో సైతం వెంచర్ వేసేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాధారణ బోగీల పెంపు కోసం ఉత్తరాల ఉద్యమం
[ 21-05-2024]
ప్రతి రైలులో సాధారణ బోగీలు ఐదుకు పెంచాలంటూ 'ఐదు సాధారణ భోగీల సాధన సమితి' ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు. -
పీసీ పీఎన్డీటీ బృందం ఏర్పాటు
[ 21-05-2024]
ప్రైవేట్ ఆసుపత్రుల్లో భ్రూణ, లింగ నిర్ధారణ చేయకుండా అడ్డుకట్ట వేయటానికి పీసీ పీఎన్డీటీ చట్టం 1994 ను పగడ్బందీగా అమలు చేయడానికి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. -
బుధవారం శ్రీనివాస స్వామి కళ్యాణం
[ 21-05-2024]
జిల్లా కేంద్రం మంగ మఠంలోని శ్రీ రమా సత్యనారాయణ దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు. -
ఘనంగా రాజీవ్ వర్ధంతి
[ 21-05-2024]
పట్టణంలోని ప్రజా సేవాభవన్లో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి
[ 21-05-2024]
రైతులు కోరిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తత్రి డిమాండ్ చేశారు. -
అర్హత లేకున్నా.. చికిత్స..!
[ 21-05-2024]
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
[ 21-05-2024]
కోటపల్లి మండలంలోని ప్రాణహిత తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని బాగు చేయడంలో మూడేళ్లుగా నిర్లక్ష్యం వెంటాడుతోంది. -
తరుగు పేరిట దోపిడీ
[ 21-05-2024]
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
అధికార్ల మెలిక.. అన్నదాత తికమక
[ 21-05-2024]
వానాకాలం పంటల సాగు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు రైతులు భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అటవీహక్కు పత్రాలు కలిగిన భూముల్లో ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు -
ఎమ్మెల్యే హరీశ్బాబును అడ్డుకున్న పోలీసులు
[ 21-05-2024]
జైనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఓ వర్గం సభ్యులు గాయపడిన విషయం విదితమే. -
తోటి మిత్రులే హంతకులై.!
[ 21-05-2024]
మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. -
రూ. 47 లక్షల విక్రయాలకు లెక్కల్లేవ్!
[ 21-05-2024]
రైతులకు రుణాలు అందించి సకాలంలో ఎరువులను సరఫరా చేసి అండగా నిలవాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు అస్తవ్యస్త నిర్వహణతో గాడి తప్పుతున్నాయి. -
తడబడితే తప్పదు మూల్యం
[ 21-05-2024]
విద్యాసంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. -
సర్కారు బడులు.. చకచకా పనులు
[ 21-05-2024]
భీంపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రహరీ, టాయిలెట్లు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మరమ్మతులతోపాటు తాగునీటి సౌకర్యం కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు -
రెండేళ్లుగా ఎదురుచూపులే
[ 21-05-2024]
తాంసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2023లో కేంద్ర బృందం సందర్శించింది. రోగులకు ఉత్తమ వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలు తదితర విషయాల్లో అత్యుత్తమ పనితీరుతో ఎన్క్వాస్కు ఎంపిక చేశారు. -
విత్తన గుట్టు విప్పండి..
[ 21-05-2024]
‘‘ మీరు కోరుకున్న కంపెనీ విత్తన సంచి కావాలంటే మేం చెప్పే మరో కంపెనీకి చెందిన రెండు విత్తన సంచులు కొనాలి. లేనట్లయితే మీరు చెప్పే విత్తనాలు ఇవ్వటం కుదరదు. -
మానవతావాదులు స్పందించారు..
[ 21-05-2024]
బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్ జాడే చికిత్స నిమిత్తం మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
-
ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు
-
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి
-
రాయదుర్గంలో ‘ఉగ్ర’ కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
-
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్రెడ్డి