logo

సీపీఐ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం

జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Published : 01 May 2024 18:48 IST

అదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు నళిని రెడ్డి, జిల్లా నాయకులు అరుణ్ కుమార్, కుంటాల రాములు, కట్ట కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని