logo

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే

జిల్లా కేంద్రంలో బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే ను ఘనంగా నిర్వహించారు.

Published : 01 May 2024 18:49 IST

అదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని వాపోయారు. 8 గంటల పని వేళలను అమలు చేయాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. పింఛను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు దేవేందర్, గాజంగుల రాజు, ఆయా కార్మిక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని