logo

కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలి

లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు.

Published : 02 May 2024 17:05 IST

ఎల్లారెడ్డి పట్టణం: లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల, నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నల్లమడుగు షరీఫ్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని