గోస తీర్చాలి.. బాసటగా నిలవాలి
పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో గల్ఫ్ కార్మికుల బతుకు భారం
నిర్మల్, న్యూస్టుడే
పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి. తినడానికి తిండిలేక, ఉండటానికి గూడులేక, అక్కడ పనిదొరక్క, అక్కడి ప్రభుత్వాలు విధించిన చట్టాల కారణంగా కొందరు రెక్కలు విరిగిన పక్షుల్లా స్వగ్రామాలకు చేరుతుండగా.. మరికొందరు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇంకొందరు అజ్ఞాతవాసంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు గల్ఫ్లో ఉన్న వారితోపాటు తిరిగొచ్చిన బాధితులు, వారి కుటుంబాలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లగా.. తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళ్తుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్న వారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబాల ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 1,96,400 మంది గల్ఫ్ బాధిత కుటుంబాల ఓటర్లు ఉండగా.. మిగతా మూడు జిల్లాలైన మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీంలలో 60 వేల మంది వరకు ఉంటారని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లలో గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు 11.5 శాతం మంది ఉన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం తమ గోడు తీర్చాలని గల్ఫ్ బాధితులు వేడుకుంటున్నారు.
గల్ఫ్లో పనిచేయడానికి వెళ్తున్న కార్మికులు
ఉమ్మడి జిల్లాలో గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు : 2,56,400
గల్ఫ్ బాధితుల సమస్యలపై పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. కేరళ తరహాలో ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రజాభవన్లో ప్రత్యేక కార్యాలయం, సెప్టెంబరు 17లోగా గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం పకడ్బందీ వ్యవస్థ, గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అమలు, తదితర డిమాండ్లపై చర్చించారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు తీరుతాయని బాధిత కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు.
ఇవీ డిమాండ్లు
- గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వార్షిక బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించాలి
- కేరళ తరహాలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
- గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, జీవిత, ప్రమద బీమా, పెన్షన్లతో కూడిన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి
- గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి
- కేంద్రం తరపున వెంటనే హైదరాబాద్లో సౌదీ, యూఏఈ, కువైట్ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి
- గల్ఫ్ బాధిత కుటుంబాల పిల్లల కోసం రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తూ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి.
- గల్ఫ్లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ద్వారా వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్లో మరణించిన వారి మృతదేహాలను తెప్పించడానికి ప్రభుత్వం చొరవ చూపించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రీ మృతి
[ 17-05-2024]
అదిలాబాద్ పట్టణంలోని సాయినగర్లో విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి దుర్మరణం చెందాడు. -
చోరీ కేసులో నేరస్తునికి రెండు నెలల జైలు
[ 17-05-2024]
దొంగతనం చేసిన కేసులో నేరస్తునికి రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ పీసీఆర్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి శుక్రవారం తీర్పునిచ్చారు. -
లక్ష గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
[ 17-05-2024]
జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. -
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ దుర్మరణం
[ 17-05-2024]
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని మావల సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. -
వానొస్తే.. వణుకే...
[ 17-05-2024]
ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నను అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. -
సరిహద్దు ప్రజలు.. చైతన్య వారధులు
[ 17-05-2024]
జిల్లా సరిహద్దు గ్రామాల్లో పల్లెవాసులు ఓటు చైతన్యం ప్రదర్శించారు. అయిదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గినా.. గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. -
ఈదురుగాలుల బీభత్సం
[ 17-05-2024]
గుడిహత్నూర్, డొంగ్రగావ్, మన్నూర్, తోషం, కొల్హారి పంచాయతీల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
రుణమాఫీకి కసరత్తు
[ 17-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
స్కాన్ చెయ్.. కథలు చదివేయ్!
[ 17-05-2024]
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పఠనా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ లిటరసీ క్లౌడ్ వెబ్సైట్ను రూపొందించింది. -
వెక్కిరిస్తున్న ఖాళీలు
[ 17-05-2024]
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయాన్ని అర్చకులు, ఉద్యోగుల ఖాళీలు వేధిస్తున్నాయి. -
ఇక ఓపీ సేవలు సులభం
[ 17-05-2024]
జనరల్ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. -
పడిపోతున్న భూగర్భ జలాలు
[ 17-05-2024]
ఎప్పుడూ లేనంతగా ఈ వేసవిలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు ఠారెత్తించాయి. -
టీకా లెక్క.. తేలేదెట్టా..!
[ 17-05-2024]
జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలోని భార్యాభర్తలు తమ ఏడాదిన్నర చిన్నారికి ఇచ్చే టీకాకు సంబంధించి ఆరోగ్య సిబ్బందిని సంప్రదించారు. -
గతమెంతో ఘనం.. నేడు దైన్యం!
[ 17-05-2024]
గతంలో గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో జిల్లాలోనే కౌటాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముందుండేది. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 17-05-2024]
ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నరకం వడ్లకే బోనస్ అంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. -
రెండు వాహనాలు ఢీ
[ 17-05-2024]
రెండు వాహనాలు ఢీకొనగా పలువురికి గాయాలైన ఘటన జాతీయ రహదారి 61పై మండలంలోని తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. -
నిరంతర సరఫరాకు పకడ్బందీ చర్యలు
[ 17-05-2024]
‘జిల్లాలో నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
తాజా వార్తలు (Latest News)
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
-
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
-
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా