logo

రాజ్యాంగ రక్షణ డీఎస్పీ తోనే సాధ్యం

రాజ్యాంగ రక్షణ కేవలం ధర్మ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ స్పష్టం చేశారు.

Published : 08 May 2024 17:56 IST

ఎదులాపురం: రాజ్యాంగ రక్షణ కేవలం ధర్మ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మెస్రం గంగాదేవి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించి డీఎస్పీ అభ్యర్థి మెస్రం గంగాదేవికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. గంగాదేవి తరపున ప్రచారంలో పాల్గొనడానికి ఈ నెల 10 న పార్టీ అధినేత విశారదన్ మహరాజ్ రానున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని