నేటి నుంచి మహిళా ఎమ్మెల్యేల సదస్సు
మహిళా ఎమ్మెల్యేల సదస్సు శనివారం నుంచి 6వ తేదీ వరకు విశాఖ కేంద్రంగా జరగనున్నది. లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ (ఎల్.బి.ఎస్.ఎన్.ఎ-ముసోరి) సహాయంతో జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సి.డబ్ల్యు) ఈ సదస్సు నిర్వహిస్తోంది.
పది రాష్ట్రాల నుంచి 40 మంది హాజరు
విశాఖపట్నం, న్యూస్టుడే: మహిళా ఎమ్మెల్యేల సదస్సు శనివారం నుంచి 6వ తేదీ వరకు విశాఖ కేంద్రంగా జరగనున్నది. లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ (ఎల్.బి.ఎస్.ఎన్.ఎ-ముసోరి) సహాయంతో జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సి.డబ్ల్యు) ఈ సదస్సు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, మిజోరం, నాగాలాండ్, గోవా, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, మహారాష్ట్ర తదితర పది రాష్ట్రాల నుంచి వంద మంది శాసనసభ్యులు పాల్గొంటారని సమాచారం అందింది. అయితే 40 మంది సుముఖత చూపినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది విశాఖ చేరుకున్నారు. వీరికి బీచ్రోడ్డులోని రాడిసన్ బ్లూ హోటల్లో అతిథ్యం కల్పిస్తున్నారు. రాష్ట్రం నుంచి మహిళా మంత్రులు విడదల రజని, ఆర్.కె.రోజాతోపాటు 13 మంది మహిళా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి ఎంత మంది వస్తున్నదీ సమాచారం రాలేదు. 6న జరగనున్న ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖాశర్మ అదే రోజు విశాఖ రానున్నారు. సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ శనివారం వస్తున్నారు.
రెవెన్యూశాఖ ప్రాంతీయ సదస్సు నేడు
రెవెన్యూశాఖ ప్రాంతీయ సదస్సు శనివారం బీచ్రోడ్డులోని రాడిసన్ బ్లూ హోటల్లో జరగనున్నది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూ.గో., డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు సదస్సుకు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీఓలు, సబ్కలెక్టర్లు, సర్వేశాఖ సహాయ సంచాలకులు, ఎంపిక చేసిన తహసీల్దార్లు పాల్గొంటారు. విశాఖ జిల్లాలో 22ఎ నుంచి తమ భూములను మినహాయించాలని 2500 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇంత వరకు 250 వరకు పరిష్కరించగా, 200 వరకు తిరస్కరించారు. గతంలో సిట్ సిఫార్సుల మేరకు కొన్ని భూములను 22ఎలో చేర్చారు. ఆయా సిఫార్సులు ఇంత వరకు అమలు కాలేదు. రెవెన్యూ సదస్సులో ఆయా సమస్యలకు ఏమైనా పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. భూముల రీసర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో పలు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలిచ్చే అవకాశం ఉంది. సదస్సులో పాల్గొనేందుకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖ చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.