రీ సర్వే వేగవంతం చేయండి
ఏజెన్సీలో వైఎస్సార్ భూ హక్కు-భూ రక్ష కార్యక్రమం ద్వారా రీ సర్వేను వేగవంతంగా చేయాలని సర్వే శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పి.కె.జయకుమారి అధికారులను ఆదేశించారు.
సమీక్షిస్తున్న సర్వే ప్రాంతీయ ఉప సంచాలకులు జయకుమారి
రంపచోడవరం, న్యూస్టుడే: ఏజెన్సీలో వైఎస్సార్ భూ హక్కు-భూ రక్ష కార్యక్రమం ద్వారా రీ సర్వేను వేగవంతంగా చేయాలని సర్వే శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పి.కె.జయకుమారి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో శనివారం ఏడు మండలాల సర్వేయర్లు, సచివాలయ సర్వేయర్లతో జయకుమారి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల దస్త్రాలను పక్కాగా పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా రీ సర్వే చేయాలన్నారు. ప్రతి మండలంలోనూ సర్వేయర్లకు లక్ష్యం ప్రకారం పనులు అప్పగిస్తామన్నారు. గ్రామసభ నిర్వహించి సర్వే ప్రారంభించాలన్నారు. మండల సర్వేయర్లు ఎప్పటికప్పుడు సర్వే పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో సర్వే ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సీహెచ్వీఎస్ఎన్ కుమార్, జిల్లా సర్వే అండ్ భూరికార్డుల అధికారి మోహనరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కె.దేవేంద్రుడు, డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, నాగభూషణం పాల్గొన్నారు.
కొయ్యూరు, న్యూస్టుడే: భూముల రీసర్వే పనులను సత్వరమే పూర్తిచేయాలని జేసీ శివ శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో భూముల రీసర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డౌనూరు, మూలపేట, పెదమాకవరం, బూదరాళ్ల పంచాయతీల్లో జరుగుతున్న సర్వే ప్రగతిని రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా సర్వే చేపట్టాలన్నారు. స్థానికులతో మాట్లాడి ఎక్కడా సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. తహసీల్దార్ తిరుమలరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.