logo

Vizag: బంగారం చోరీ కేసులో యువ నటి అరెస్టు

దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో జరిగిన దొంగతనం కేసులో ఓ యువ నటిని ఆదివారం నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Updated : 04 Mar 2024 06:55 IST

గురుద్వారా, న్యూస్‌టుడే : దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో జరిగిన దొంగతనం కేసులో ఓ యువ నటిని ఆదివారం నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పెందుర్తికి చెందిన సౌమ్యశెట్టి బాధితుడు ప్రసాద్‌ కుమార్తెకు ఇన్‌స్టాగ్రాంలో కొన్నాళ్ల క్రితం పరిచయం అయింది. ఫిబ్రవరి 2న ఆమె ఇంటికి వచ్చిన ఈ యువతి బీరువాలో ఉన్న బంగారాన్ని దొంగిలించింది. బాధితుడు ప్రసాద్‌ గత నెల 23న బీరువా తెరిచి చూడగా అందులో 74 తులాల బంగారం కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు సౌమ్యశెట్టి ఈ బంగారాన్ని దొంగిలించినట్లుగా నిర్ధారించుకుని ఆమెను అరెస్టు చేశారు. సౌమ్యశెట్టి పలు చిత్రాల్లో నటించింది. చోరీ తరువాత నగలతో గోవా వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు