logo

వైకాపా ప్రచారంలో వాలంటీర్లు

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

Published : 28 Mar 2024 02:14 IST

గంధవరం గ్రామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు (వృత్తంలో)

పద్మనాభం, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంత మంది వాలంటీర్లు వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పద్మనాభం మండలం గంధవరం గ్రామంలో ఈనెల 26వ తేదీన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏకంగా ఆరుగురు వాలంటీర్లు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ ప్రచారంలో గ్రామ వాలంటీర్లు పిల్లి ముత్యాలు, కింగం శేఖర్‌, కొత్తపల్లి అప్పలరాజు, తాండ్రంగి జగదీశ్‌, కొత్తపల్లి రామకుమారి, చిప్పాడ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. వీరితో పాటు కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడాన్ని ఇతర పార్టీల నాయకులు తప్పుపడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వైకాపా నేతలతో కలిసి ప్రచారం చేస్తున్న సహకార బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ (వృత్తంలో)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని