logo

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

  ఎంపీగా కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేగా శిరీషారాణిల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని  కూటమి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Published : 28 Mar 2024 02:18 IST

సీతాపురంలో సమావేశమైన కూటమి నాయకులు

ఎటపాక, న్యూస్‌టుడే:  ఎంపీగా కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేగా శిరీషారాణిల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని  కూటమి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీతాపురంలో భాజపా మండల అధ్యక్షులు మోదుగు పెరమయ్య అధ్యక్షతన బుధవారం కూటమి నాయకుల సమావేశం జరిగింది. నేతలు మాట్లాడుతూ సూచించారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెదేపా మండల క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మాచినేని రాజేష్‌, జనసేన మండల అధ్యక్షులు మారాసు గంగాధర్‌, భాజపా నాయకులు బొల్లా ప్రసాద్‌, గందం జయమ్మ, పేరాల రాజు, చింతా దుర్గారావు, తెదేపా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, బొల్లా రమేష్‌, జనసేన నాయకులు కొట్టె ప్రశాంత్‌, గద్దల సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని