సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం
అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెదబయలు గ్రామీణం, న్యూస్టుడే: అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీవో నంబరు 3 రద్దుతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టాలని కోరారు. కూటమి నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీగా నామినేషన్కు..
హుకుంపేట, న్యూస్టుడే: ఎన్టీఏ కూటమి అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్ సందర్భంగా హుకుంపేటలో శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టారు. గడుగుపల్లి గ్రామం నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు, కార్లతో నాయకులు, కార్యకర్తలు వందలాది మంది ర్యాలీగా పాడేరు చేరుకున్నారు. ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తరలిన తెదేపా శ్రేణులు
ఎటపాక: రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి నామినేషన్ కార్యక్రమానికి మండలం నుంచి తెదేపా శ్రేణులు శుక్రవారం భారీగా తరలివెళ్లాయి. ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, నెల్లిపాక, గౌరిదేవిపేట, లక్ష్మీపురం, చోడవరం తదితర గ్రామాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు రంపచోడవరం వెళ్లారు. తెదేపా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. సీనియర్ నాయకులు పాటి చలపతిరావు, దొంతు మంగేశ్వరరావు, కిలారి వెంకటేశ్వరరావు, నలజాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
‘పాడి’కుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. -
మీ భవితకు నాదీ భరోసా!
[ 02-05-2024]
యువత భవితకు నాదీ భరోసా అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
వైకాపాకు ఓటమి తప్పదు
[ 02-05-2024]
మంచి, చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలో చెడుమార్గంలో నడుస్తున్న వైకాపాకు ఓటమి తప్పదని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
అన్నివర్గాల సంక్షేమమే కూటమి లక్ష్యం
[ 02-05-2024]
అన్నివర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుందని.. ఇందుకు నిదర్శనం ఎన్నికల మ్యానిఫెస్టో అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ అన్నారు. -
గ్రామాల్లో నాటుసారా కంపు
[ 02-05-2024]
మన్యంలోని కొన్ని గ్రామాలు నాటుసారా కర్మాగారాలుగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత విచ్చలవిడి అయింది. -
సుకుమామిడిలో దాహం కేకలు
[ 02-05-2024]
చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి శివారు గూడెంలో తాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. -
వైకాపా అంతం.. కూటమి పంతం
[ 02-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపా అంతమే కూటమి పంతమని భాజపా రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. -
వేటాడి తాపీమేస్త్రి దారుణ హత్య
[ 02-05-2024]
బుచ్చెయ్యపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం చెరువు పనులకు, పొలాలకు వెళ్లే వారు, పాకల వద్దకు వెళ్లి పాలు తీసుకువచ్చేందుకు ఇళ్ల నుంచి ఒక్కొక్కరిగా బయలుదేరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు