logo

చంద్రబాబు ఆశీస్సులున్నాయి: ఈశ్వరి

తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్‌ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

Published : 20 Apr 2024 02:00 IST

కొయ్యూరు, న్యూస్‌టుడే: తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. తన అనుచరులను కలిసి నామినేషన్‌ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. తనకే తెదేపా అధినేత చంద్రబాబు ఆశీస్సులున్నాయని తమతో చెప్పినట్లు స్థానిక నేతలు పేర్కొన్నారు. మర్రివాడ, రాజేంద్రపాలెం తదితర పంచాయతీల్లో ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెదేపా మండల ప్రధాన కార్యదర్శి టి.దొరబాబు, నేతలు వరహాలబాబు, సింహాచలం, సీహెచ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు, ధారకొండ, దుప్పిలవాడ, గుమ్మిరేవుల పంచాయతీల్లో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పర్యటించారు. ఈ నెల 22న నామినేషన్‌ వేస్తున్నానని పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్లుగా తెదేపా బలోపేతానికి పాటుపడ్డానన్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు గంటా నళిని, తెదేపా మండల అధ్యక్షుడు రమేష్‌, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చిటికెల రాము తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని