జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది.
మలేరియా నివారణ దినం నేడు
పాడేరు మండలంలో పిచికారీ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ సునీత
పాడేరు పట్టణం, కొయ్యూరు, న్యూస్టుడే: మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. ఏజెన్సీలో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా మలేరియా తగ్గుముఖం పట్టే ప్రసక్తి లేదని, తగ్గినట్లు కనిపించినా ప్రతి నాలుగేళ్లకోసారి విజృంభిస్తుందని నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ఇది వైద్య, ఆరోగ్యశాఖకు తెలిసినా నిధులు లేవని, కేసులు తగ్గాయని, అసలు మరణాలే లేవంటూ తప్పుడు నివేదికలతో ఏళ్ల తరబడి కాలక్షేపం చేసింది. ఎన్నికల సమయంలో ప్రజా వ్యతిరేకత రాకుండా మొక్కుబడిగా దోమల నివారణకు పిచికారీ పనులు మొదలు పెట్టడం గమనార్హం. గురువారం మలేరియా నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
- మలేరియా వ్యాప్తి చెందేందుకు గిరిజన ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు అనుకూలమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- దోమల నివారణ చర్యలు చేపట్టడంతోపాటు మలేరియా మందులు, ఇతర సామగ్రి సమకూర్చాల్సిన అధికార యంత్రాంగం 2021 నుంచి వీటిని పట్టించుకోలేదు. దోమ తెరల పంపిణీ నిలిపివేసింది. ఏటా వేసవి ప్రారంభానికి ముందే వ్యాధి వ్యాప్తి కాకుండా చైతన్య సదస్సులు, ర్యాలీలు నిర్వహించేవారు. ప్రతి గ్రామంలో రెండు విడతల్లో పిచికారీ పనులు చేయించేవారు. ఆ తర్వాత హైరిస్కు గ్రామాల్లో మాత్రమే మందు పిచికారీ చేస్తున్నామని చెబుతున్నారు. గత ఏడాది నుంచి ఈ ప్రక్రియ సైతం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు.
- ఏటా మలేరియా నివారణ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు రూ.రెండు కోట్ల వరకూ ఖర్చవుతోంది. బడ్జెట్ లేదంటూ కేసులు నమోదు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. పిచికారీ పనులకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చవుతోంది. మందుల కొనుగోలు, ప్రచారం, దోమ తెరల పంపిణీ వంటి కార్యక్రమాలకు మరో రూ.కోటిన్నర వరకూ ఖర్చు అవుతుంది. పాడేరులో ఉన్న మలేరియా కార్యాలయం సైతం నామమాత్రంగా కొనసాగుతోంది. ఇక్కడి సిబ్బంది వేర్వేరు విభాగాల్లో డిప్యుటేషన్లతో మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
కేసులు ఉన్నా... మరణాలు లేవట!
పాడేరు డివిజన్లో 2017-18లో 2252 కేసులు నమోదు కాగా.. 2018-19లో 1121, 2019-20లో 586, 2022-23లో 3711, 2024 ఏప్రిల్ నాటికి 546 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత పదకొండు ఏళ్ల నుంచి మలేరియా మరణం అధికారికంగా ఒక్కటీ కూడా నమోదు చేయలేదు. మలేరియా లక్షణాలతో చనిపోయినా వైరల్, టైఫాయిడ్ జ్వరంగా వైద్యారోగ్యశాఖ నమోదు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM