వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు.
నక్కపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. జానకయ్యపేటలో మంగళవారం రాత్రి నియోజకవర్గస్థాయిలో యాదవుల సమావేశం నిర్వహించగా రమేశ్, ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రమేశ్ మాట్లాడుతూ దేశంలో యాదవులకు ప్రత్యేక స్థానం ఉందని, కేంద్రంలోనూ వీరు పలు కీలక పదవుల్లో ఉన్నారన్నారు. తెదేపా హయాంలో యాదవులకు తితిదే ఛైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాళ్లపాలెంలో బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అనిత మాట్లాడుతూ బీసీలకు తెదేపా హయాంలో మాత్రమే మేలు జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తారని వివరించారు. కురందాసు నూకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గింజాల లక్ష్మణరావు, దేవర సత్యనారాయణ, కురందాసు సింహాచలం, అల్లు నరసింహమూర్తి, వైబోయిన రమణ, గొనగాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సొంత చెల్లినే గౌరవించలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఎలా గౌరవిస్తారని, రాష్ట్రానికి ఏం మంచి చేయగలరని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత విమర్శించారు. ఉపమాక పంచాయతీ పరిధిలోని మనబాలవానిపాలెం, కొర్రవానిపాలెం గ్రామాల్లో మంగళవారం ఆమె తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు. జగన్ బహిరంగ సభల్లో తన చెల్లిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో గుర్తించాలన్నారు.
వైకాపా నుంచి తెదేపాలో చేరిక
ఉద్ధండపురానికి చెందిన వైకాపా నాయకులు పలువురు తెదేపాలోకి చేరారు. సారిపల్లిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత వీరికి కండువాలు వేసి తెదేపాలోకి ఆహ్వానించారు. కొప్పిశెట్టి వెంకటేష్, కొప్పిశెట్టి కొండబాబు, పాకలపాటి రవిరాజు, గుద్దాటి సత్యనారాయణ, పాము గణేష్, పోలినాటి నానాజీ, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ తోట నగేష్, పొడగట్ల రమణ, తుమ్మల వెంకటకమణ తదితరులు పాల్గొన్నారు.
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే: ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు. తురకలపూడిలో మంగళవారం కూటమి నాయకులతో కలిసి గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దివాలా తీసిందని విమర్శించారు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జనసేన ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు, భాజపా నాయకుడు నాగరాజు, ఎం.వి.వి.సత్యనారాయణ, కోరుకొండ రవికుమార్, గేదెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదీ జీవం.. ఎక్కడా వైవిధ్యం!
[ 22-05-2024]
మానవ తప్పిదాలతో కాలక్రమంలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఆధునిక జీవన శైలిలో పర్యావరణం కాలుష్యానికి గురవుతోంది. భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. -
నిర్మించి నెల.. పెచ్చులూడిందిలా..
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వంలో మన్యం ప్రాంతంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడమే గగనమైంది. చేసిన కొద్ది పనులూ నాణ్యతగా చేపట్టకపోవడంతో అధ్వానంగా తయారవుతున్నాయి. -
కొనలేం.. తినలేం
[ 22-05-2024]
వేసవిలో కమ్మటి సువాసనతో అందరి నోరూరించే మామిడిపండు ఈ ఏడాది ప్రియమైపోయింది. దిగుబడులు భారీగా తగ్గడం, ఇతర ప్రాంతాల్లో డిమాండుతో సామాన్యులు మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా పోయింది. -
ఇతరులను అనుమతించొద్దు
[ 22-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూంల వద్దకు ఇతరులను అనుమతించొద్దని కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. -
ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తం
[ 22-05-2024]
పెదబయలు పోలీసుస్టేషన్ను ఎస్పీ తుహిన్ సిన్హా, సీఐ రమేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై మనోజ్కుమార్, సిబ్బందితో సమావేశమయ్యారు. -
తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ స్వగ్రామంలో సోదాలు
[ 22-05-2024]
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు స్వగ్రామమైన బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, రోలుగుంటలోని బంధువుల ఇళ్లలో మంగళవారం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. -
సజావుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
[ 22-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి బి.పద్మావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆర్ఎంపీ వైద్యంతో రోగి మృతిపై విచారణ
[ 22-05-2024]
ఆర్.ఎం.పి. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతిచెందాడనే ఆరోపణపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. -
అంగన్వాడీల నేత తులసి హఠాన్మరణం
[ 22-05-2024]
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి (45) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈమె అంగన్వాడీల సమస్యలపై గత ఇరవై ఏళ్లుగా పోరాటాలు చేస్తూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..