logo

కూటమి గెలుపుతోనే భవిష్యత్తు

వైకాపా ప్రభుత్వ పాలనలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. 

Published : 01 May 2024 02:01 IST

అడ్డతీగల, రంపచోడవరం, న్యూస్‌టుడే:  వైకాపా ప్రభుత్వ పాలనలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు.  గొంటువానిపాలెం నుంచి రాయపల్లి వరకు కూటమి నాయకులు మంగళవారం ర్యాలీ, ప్రచారం నిర్వహించారు. రాయపల్లిలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చారు. శిరీష మాట్లాడుతూ కూటమి విజయంతోనే మన్యానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి శిరీషాదేవి గెలుపుకోసం కృషి చేయాలని తెదేపా రాష్ట్ర కార్యాలయ ప్రత్యేక పరిశీలకులు టి.హర్షవర్ధన్‌ప్రసాద్‌ సూచించారు.  నాయకులు నల్లు శ్రీనివాసరావు, పాండ్రంగి జయరాజ్‌లతో కలిసి ఆయన రంపచోడరవంలో స్థానిక నేతలతో సమావేశమయ్యారు.  ప్రచారం  తీరు తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని