కదల్లేని వారిపై కనికరమేది...!
ప్రతిపక్షాలపై కక్ష.. కదల్లేని పింఛను లబ్ధిదారులకు శాపంగా మారింది. వయోవృద్ధులకు ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
80 ఏళ్లు దాటిన వృద్ధులకు నేటికీ అందని పింఛన్
పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు జోగులమ్మ, వెంకటరావు
గూడెంకొత్తవీధి, న్యూస్టుడే: ప్రతిపక్షాలపై కక్ష.. కదల్లేని పింఛను లబ్ధిదారులకు శాపంగా మారింది. వయోవృద్ధులకు ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గూడెంకొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ చెక్కమద్ది గ్రామానికి చెందిన పాతూని జోగులమ్మకు 103 ఏళ్లు. ఈమె నడవలేదు. ఈమె బ్యాంకు ఖాతాలో నగదు వేశారట. ఆమె బ్యాంకుకు వెళ్లి పదేళ్లు పైనే అవుతోంది. ఖాతా మనుగడలో ఉందో లేదో తెలియని పరిస్థితి. అదే పంచాయతీలోని వండలం వెంకటరావు(85) అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు రాలేరు. పూజారి కాసులమ్మ(80), గుబులంగి కన్నమ్మ(82)లు కూడా కదల్లేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాస్తవానికి 80 ఏళ్లు పైబడిన వారికి బ్యాంకు ఖాతాల్లో కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంది. అయినా ఎవరూ అందించలేదని వారు వాపోతున్నారు. కేవలం ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు వృద్ధులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పలువురు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
రంపచోడవరంలో పుష్ప-2 చిత్రీకరణ
[ 19-05-2024]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్లో చిత్రీకరించారు. -
జడిగుడ జలజలా.. జోలాపుట్టు వెలవెల!
[ 19-05-2024]
ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం మండువేసవిలోనూ జాలువారుతూ కళకళలాడుతోంది. -
ఆన్లైన్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
[ 19-05-2024]
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నారు. -
సరిహద్దులు దాటని అభివృద్ధి
[ 19-05-2024]
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. -
ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
[ 19-05-2024]
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!