ఇచ్చేదేం లేదు.. అంతా పట్టుకుపోవడమే!
నోటి ముందు కూడు లాగేయడం జగన్ ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. రైతులకు ఉపయోగపడేలా కొత్తగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్నవాటిని తరలించేశారు.
జగన్ మార్కు పాలన జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం
అనకాపల్లి, న్యూస్టుడే
నోటి ముందు కూడు లాగేయడం జగన్ ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. రైతులకు ఉపయోగపడేలా కొత్తగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్నవాటిని తరలించేశారు. రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటానంటూ పాదయాత్ర సమయంలో జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలకు, చేసిన పనులకు పొంతన లేదు. అనకాపల్లిలో తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని, ఎప్పటి నుంచో ఉన్న ఏరువాక కేంద్రాన్ని తరలించేసి జిల్లా రైతులకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది.
వ్యవసాయం గిట్టుబాటు కానందున జిల్లాలోని అధిక శాతం రైతులు ఉద్యాన పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. వీరికి అండగా ఉండాలనే ఉద్దేశంతో 2017 జూన్లో అనకాపల్లికి అప్పటి తెదేపా ప్రభుత్వం ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసింది. అనకాపల్లి మండలం టి.వెంకుపాలెంలో ఇందుకోసం స్థలం కేటాయించారు. పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో 2018 మే 11న తాత్కాలికంగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు, ఒక ఉద్యోగిని నియమించారు. రెండేళ్లు యార్డులోనే పరిశోధన కేంద్రం కొనసాగింది. అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా ఉండేవారు. దీంతో ఆయన పట్టుబట్టి ఈ కేంద్రాన్ని మంజూరు చేయించారు. స్థల సేకరణకు రూ. 6 కోట్లు, భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలకు మరో రూ. 4.81 కోట్లను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో దీనిని ఇక్కడ నుంచి తరలించేసింది. దీనిపై ఉద్యాన రైతులు లబోదిబోమన్నా కనీసం పట్టించుకోలేదు.
ఉద్యాన రైతుల అగచాట్లు
జిల్లాలో 10,880 హెక్టార్లు మామిడి, 27,900 హెక్టార్లలో జీడిమామిడి, 9,200 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. కూరగాయల సాగు కూడా అధికమే. ఇక్కడ దాదాపు నాలుగువేల హెక్టార్లలో వంకాయ, టమాటా, బీర, బెండ, కాకర, దోస వంటి పంటలను పండిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువగా కొబ్బరి సాగు చేస్తున్నారు. అందుకే అనకాపల్లి పరిశోధన కేంద్రంలో మామిడి, జీడిమామిడి, కొబ్బరి, కూరగాయలపై పరిశోధనలు చేసేవారు. దీనిని ఇక్కడి నుంచి తరలించేశాక సరైన యాజమాన్య పద్ధతులు చెప్పే నాథుడు లేరు. ఉద్యాన శాఖ అధికారులు బాపట్ల పరిశోధన కేంద్రం నుంచి జీడిమొక్కలు తీసుకువచ్చి రైతులకు ఇస్తున్నారు. కొబ్బరి, మామిడి మొక్కలను సొంతంగా తయారుచేసి రైతులకు అందిస్తున్నారు. వీటిలో జిల్లాకు అనువైన రకాలు అంతగా ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఉద్యాన పంటలపై మిడతల తాడి పెరుగుతోంది. మామిడి, జీడిమామిడి పూత సమయంలో పురుగులు సోకి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పరిశోధన కేంద్రం ఉంటే వీటి నివారణకు సకాలంలో సూచనలందేవి. ఈ కేంద్రాన్ని తరలించేసి జగన్ సర్కారు తమ పొట్ట కొట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏరువాక.. వెళ్లిపోయే!
అనకాపల్లి, న్యూస్టుడే: అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేస్తుంటారు. వీరు చేస్తున్న పరిశోధనలు రైతులకు పూర్తి స్థాయిలో చేరడం లేదు. రైతులు నేరుగా అనకాపల్లి రావడం తక్కువ. అందుకే శాస్త్రవేత్తలనే నేరుగా రైతుల పంటపొలాల వద్దకు పంపాలనే లక్ష్యంతో ఏరువాక కేంద్రాన్ని ఇక్కడ 2003లో ఏర్పాటు చేశారు. ఇందు కోసం పరిశోధన కేంద్రం ఆవరణలోనే ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలను నియమించారు. జిల్లా అంతటా తిరిగేందుకు వాహన సదుపాయం కల్పించారు. వీరు గ్రామాల్లో పర్యటిస్తూ పరిశోధనా స్థానంలో నూతనంగా రూపొందించే కొత్త వంగడాల గురించి వివరించడం, పరిశోధనల ఫలితాలను చేరవేయడం చేస్తుండేవారు. గ్రామాల్లో ఆదర్శ రైతులను గుర్తించి వారి భూముల్లో నూతన వంగడాలను వేయించేవారు. రెండు దశాబ్దాలుగా అన్నదాతలకు ఎంతో ఉపయోగపడిన ఈ కేంద్రాన్ని వైకాపా ప్రభుత్వం గతేడాది గోదావరి జిల్లాలకు తరలించేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
-
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే