ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి రావాలి
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.
రామలింగయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు, కుటుంబ సభ్యులు
చల్లపల్ల్లి, న్యూస్టుడే: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఐ అగ్రనేత చండ్ర రామలింగయ్య వర్ధంతిని మంగళాపురంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో రామలింగయ్య సుస్థిరస్థానం పొందారన్నారు. ప్రధాని మోదీని, అదానీని విమర్శిస్తే దేశంపై దాడి చేస్తున్నట్లుగా అభివర్ణిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా పరిపాలన మారిందన్నారు. అభివృద్ధి శూన్యమని, ప్రజాస్వామ్యం లేదని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్ మాట్లాడుతూ రామలింగయ్య ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఘనంగా నడిపి పార్టీకి అండగా నిలిచారన్నారు. సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజాస్వామ్య గొంతుకలు బలపడాలని ఆకాంక్షించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాదబాబు అధ్యక్షతవహించగా నాయకులు టి.తాతయ్య, ఆర్.పిచ్చియ్య, చిన్నం కోటేశ్వరరావు, మల్లుపెద్ది రత్నకుమారి, అరసం మాధవరావు, వెలగపూడి ఆజాద్, దేవభక్తుని నిర్మల, దగాని సంగీతరావు తదితరులు ప్రసంగించారు. తొలుత రామలింగయ్య ఘాట్వద్ద ఆయన చిత్రపటానికి సీపీఐ నాయకులు, రామలింగయ్య కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్