ఉల్టా లాగేస్తున్నారు..!
రోడ్డు పక్కన టీ తాగినా.. పానీపూరీ తిన్నా.. షాపింగ్కు వెళ్లినా.. అవసరం ఏదైనా.. రూ.5 అయినా రూ. 50వేలు అయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం బాగా పెరిగింది.
క్యూఆర్ కోడ్, చెల్లింపు రిక్వెస్ట్లు పంపుతూ మోసం
స్కాన్ చేస్తే ఖాతాల నుంచి డబ్బు మాయం
భారీగా కేసుల నమోదు
ఈనాడు - అమరావతి: రోడ్డు పక్కన టీ తాగినా.. పానీపూరీ తిన్నా.. షాపింగ్కు వెళ్లినా.. అవసరం ఏదైనా.. రూ.5 అయినా రూ. 50వేలు అయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం బాగా పెరిగింది. టక్కున జేబులోని మొబైల్ తీసి బిల్లు చెల్లించడం ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పలు యాప్లు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. వీటిని కేటుగాళ్లు తమ మోసాలకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా కొత్త ఎత్తుగడలతో ఏమాత్రం అనుమానం రాకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. నగరంలో ఈ తరహా మోసాలకు సంబంధించిన కేసులు పలు స్టేషన్లలో నమోదు అవుతున్నాయి.
రిక్వెస్ట్ పేరుతో ఎర
* తన ఇంటిని అద్దెకు ఇస్తానని, విజయవాడ నగర శివారు గ్రామానికి చెందిన మహిళ ఓ యాప్లో ప్రకటన ఇచ్చారు. దీనికి స్పందనగా ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను బీఎస్ఎఫ్ ఉద్యోగినని, గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. ఇంట్లో అద్దెకు దిగుతానని, ముందుగా రూ.5వేలు అడ్వాన్స్ను గూగుల్ పే ద్వారా పంపుతున్నట్లు చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి తన గూగుల్ పే ఖాతాకు పంపిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడంతో అంతమొత్తం పోయింది.
* కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఓ సైట్లో తన ఇంటిని అద్దెకు ఇస్తున్నట్లు, ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని ఫోన్ నెంబరు ఇచ్చారు. ఓ వ్యక్తి ఫోన్ చేసి, తమ కుటుంబం ఆ ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పాడు. అడ్వాన్స్ మొత్తాన్ని యూపీఐ యాప్ ద్వారా రూ.40వేలు పంపుతున్నానని, తాను క్యూఆర్ కోడ్ పంపుతున్నట్లు.. దానిని స్కాన్ చేయాలని చెప్పాడు. నిజమే అని నమ్మిన ఆమె, తన ఫోన్కు వచ్చిన ఆ కోడ్ను స్కాన్ చేసింది. ఆమె ఖాతా నుంచి ఆ మేరకు నగదు మాయం అయింది.
తరచిచూడాలి..
* చెల్లింపు యాప్ల్లో ఉండే ‘రిక్వెస్ట్’ అనే ఫీచర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనకు డబ్బు పంపించాల్సిన వ్యక్తికి దీనిని పంపుతూ, కావాల్సిన మొత్తాన్ని ఇందులో నమోదు చేస్తాం. అవతలి వ్యక్తి Ëక్లిక్ చేయగానే అంత మేర నగదు, వారి ఖాతా నుంచి పంపిన వారికి జమ అవుతుంది. దీని గురించి తెలియని వారికి, తమకు అంత మొత్తం డబ్బు పంపుతున్నారేమో అని రిక్వెస్ట్ను అంగీకరిస్తూ క్లిక్ చేస్తారు. దీని వల్ల నగదు పోతుంది.
* మీకు డబ్బు పంపుతున్నామంటూ వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్ను మోసగాళ్లు పంపుతున్నారు. దీనిని స్కాన్ చేస్తే నగదు, మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మిస్తున్నారు. తీరా స్కాన్ చేస్తే..ఆ మేరకు డబ్బు ఖాతా నుంచి డెబిట్ అవుతోంది.
జాగురూకతతో నివారించవచ్చు
* యూపీఐ యాప్ ద్వారా నగదు స్వీకరించే సమయంలో పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
* ఎట్టి పరిస్థితుల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డబ్బు పంపించమని ఉన్న రిక్వెస్ట్ను అంగీకరించొద్దు.
* ఎవరితోనూ యూపీఐ పిన్ను పంచుకోవద్దు.
* క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా డబ్బు పంపించాల్సిన వ్యక్తి వివరాలు తెలుసుకుని లావాదేవీ నిర్వహించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.