బిల్లు చూస్తేనే... షాక్!
అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలతో మరింత భారంగా మారుతున్నాయి.
ఒకేదఫా మూడు సర్దుబాటు ఛార్జీలతో విలవిల
ఉమ్మడి జిల్లా ప్రజలపై రూ.700 కోట్ల మేర బాదుడు
ప్రభుత్వ వైఖరిపై అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం
అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలతో మరింత భారంగా మారుతున్నాయి. ఒకేసారి మూడు సర్దుబాటు ఛార్జీలను మోపతుండడంతో సామాన్యులు హడలుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలపై ఈ ఛార్జీల భారం సుమారు రూ.700 కోట్ల మేర పడుతోంది. భారీగా వస్తున్న కరెంటు బిల్లులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు, ఈ బిల్లులు మరింత కుంగదీస్తున్నాయని వాపోతున్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. సర్దుబాటు భారం వినియోగదారుల నడ్డి విరుస్తోంది. డిస్కమ్కు నష్టాలు వచ్చాయంటూ ఇప్పుడు వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- విజయవాడ రాణిగారితోటకు చెందిన ఓ మహిళాకూలీ ఇంటికి జులైలో వచ్చిన కరెంటు బిల్లు రూ.4,576. గతంలో ఎప్పుడూ రూ.1,200 మించి వచ్చేది కాదు. ఈసారి వచ్చిన బిల్లు చూసి నిర్ఘాంతపోయింది. ఈ బిల్లులో ట్రూఅప్ ఛార్జీలు రూ.110.31, 2021 జూన్కు ఇంధన సర్దుబాటు ఛార్జీ రూ. 113.17, ఈ ఏడాది మే సర్దుబాటు ఛార్జీ రూ.135.60 చొప్పున వెరసి మొత్తం రూ.359.08 విధించారు. బిల్లు సరిచూడమని విద్యుత్తు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేక అప్పు చేసి చెల్లించింది.
- విజయవాడలో పాయకాపురం ప్రాంత సాధారణ కుటుంబానికి జులైలో రూ.982 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఇందులో ట్రూ అప్ భారం రూ.38.92 కాగా, 2021 జూన్ సర్దుబాటు ఛార్జీ రూ.21.31, ఈ ఏడాది మే సర్దుబాటు ఛార్జీ రూ.69.20 వంతున మొత్తం రూ.129.43 భారం మోపారు. చిన్న పనులు చేసి బతికే తాము ఈ బిల్లు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు.
కంచికచర్లలో ఓ మహిళ ఇంటికి రూ.1,240 బిల్లు వచ్చింది. అసలే పేద కుటుంబం.. ఆపై భారీగా వచ్చిన బిల్లు భారంగా మారిందని వాపోయింది. ట్రూఅప్ ఛార్జీ రూ.50, ఇంధన సర్దుబాటు ఛార్జీ రూ.80 చొప్పున సర్దుపోటు రూ.130 వడ్డించారు. సర్దుబాటు ఛార్జీల పేరిట పది శాతం మేర బిల్లు పెరిగింది.
తడిసిమోపెడు...
విద్యుత్తు వ్యాపారానికి సంబంధించి 2014-15 నుంచి 2018-19 కాలంలో డిస్కమ్కు నష్టాలు వచ్చాయని ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ కాలంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్కు 22 పైసలు చొప్పున లెక్కగట్టి నిరుడు ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నారు. మొత్తం 36 నెలలు విధించే ఈ ఛార్జీల్లో ఇప్పటి వరకు 12 నెలలకు వేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై ఈ భారం రూ. 270 కోట్లు విధించారు. దీంతోపాటు 2021-22లో నష్టాల పేరుతో మరో రూ.వంద కోట్ల భారం మోపారు. దీనిని 2021-22లో ఏ నెలలో వాడిన యూనిట్లను 2023-24లో అదే నెలలో బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. యూనిట్కు 20 పైసలు నుంచి గరిష్ఠంగా 66 పైసల వరకు ఈ భారం విధించారు. యూనిట్ వారీగా నాలుగు త్రైమాసికాలకు... రూ.0.20, రూ.0.63, రూ.0.63, రూ.0.66 చొప్పున లెక్కించి వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సంబంధిత నెలలో వాడుకున్న విద్యుత్తుపై తర్వాత నెలలో వచ్చే బిల్లులో లెక్కించి సర్దుబాటు చేస్తున్నారు. ఈ భారం రూ.330 కోట్ల మేర పడుతోంది. వెరసి ఈ మూడు రకాల భారాల కారణంగా ప్రజలపై రూ.700 కోట్ల మేర సర్దుబాటు ఛార్జీల పేరిట మోపుతున్నారు.
- కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఓ కుటుంబానికి జులైలో కరెంటు బిల్లు రూ.487 వచ్చింది. ట్రూ అప్ ఛార్జీ.. రూ.24.46, 2021 జూన్ సర్దుబాటు భారం రూ.2.82, ఈ ఏడాది మే సర్దుబాటు రుసుము రూ.48.40 వంతున రూ.75.68 భారం వేశారు. పని చేస్తేనే ఇల్లు గడిచే ఈ కుటుంబానికి ప్రతి నెలా విద్యుత్తు బిల్లు షాక్ కొడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!