మోగింది కల్యాణ వీణ
ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో ముహూర్తాలు లేక రెండు నెలలుగా వివాహాది శుభకార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. నిజశ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల .సందడి తిరిగి ఊపందుకోనుంది.
నిజశ్రావణ మాసం ఆరంభంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు
న్యూస్టుడే, చల్లపల్లి గ్రామీణం, అవనిగడ్డ: ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో ముహూర్తాలు లేక రెండు నెలలుగా వివాహాది శుభకార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. నిజశ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల .సందడి తిరిగి ఊపందుకోనుంది. శనివారం నుంచి డిసెంబరు 31 వరకు దాదాపు 50కిపైగా ముహూర్తాలు ఉండటంతో ఇక వివాహాలు ముమ్మరంగా సాగనున్నాయి. దీంతో కల్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. వాటితోపాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు కూడా ఊపందుకోనున్నాయి.
- శుభకార్యక్రమాల నిర్వహణలో అనుసంధానంగా ఉన్న దాదాపు 25 రంగాలవారికి చేతి నిండా పని దొరికినట్లే. పురోహితులు, ట్రావెల్స్, వస్త్రదుకాణాలు, టైలరింగ్, కిళ్లీలు, బాజాబజంత్రీలు, తీన్మార్ డప్పు కళాకారులు, వంటమేస్త్రీలు, క్యాటరింగ్, అలంకార నిపుణులు, బ్యూటీ పార్లర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, మైకు సిస్టమ్, కల్యాణ మండపాలు, కళాకారులు, సెలబ్రెటలు, గాయకులు, సప్లయర్లు, కూరగాయలు, అరటి ఆకుల సరఫరాదారులు, విద్యుత్తు తదితర రంగాల వారికి అయిదు నెలల పాటు ఉపాధి లభించనుంది.
ముహూర్తాలివే..
ఆగస్టులో: 19, 20, 22, 24, 26, 29, 30, 31
సెప్టెంబరు : 1, 2, 3, 6, 7, 8
అక్టోబరు : 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31.
నవంబరు : 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29
డిసెంబరు : 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31
ఉచిత వివాహాలకు అవకాశం
పెళ్లిళ్లు, విందుల ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలవారు భారీ బడ్జెట్ కేటాయించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ దేవాలయంలో ఉచితంగా వివాహాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వధూవరులకు మంగళసూత్రాలు, పట్టువస్త్రాలు, కాలి మెట్లు, తదితరాలను దేవస్థానం వారు ఉచితంగా సమకూరుస్తున్నారు.
- వెంకటాపురం రామాలయంలో కూడా వధూవరులకు ఆలయ వ్యవస్థాపకులు రూ.10 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు.
సంప్రదాయాలతో డెకరేషన్: మెరకనపల్లి నరేష్, అలంకార నిపుణుడు
పాతతరంలో మాదిరిగా కొబ్బరి, తాటాకులతో పందిళ్లు వేయడం, సహజమైన పూల తోరణాలు, మామిడి ఆకులతో కల్యాణ మండపాలను అందంగా అలంకరిస్తున్నాం. వీనుల విందుగా పాతపాటలు, హాస్యంతో ఆకట్టుకునే కళాకారులను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం మీద గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా పెళ్లి సందడి ఏర్పాట్లు చేయబోతున్నాం.
విరామం లేకుండా...
ఈ సంవత్సరం ఆఖరు వరకు దాదాపు 50కిపైగా సుముహూర్తాలున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం వల్ల కల్యాణ మండపాల్లోనే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాం. శుభ కార్యక్రమాలకు తోడు సీజనల్గా వచ్చే శ్రావణ మాస పూజలు, వ్రతాలు, గణపతి, శరన్నవరాత్రి, కార్తికమాస పూజలు అదనంగా ఉన్నాయి.
అడుసుమిల్లి కుటుంబరావు, పురోహితుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!