Gudivada: ‘నానీ నీ డ్రామాలిక చెల్లవు’
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల వేళలో వేసే డ్రామాలు అందరికీ తెలుసని, ప్రతిపక్షాలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు.
మాట్లాడుతున్న రావి, వెనిగండ్ల
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల వేళలో వేసే డ్రామాలు అందరికీ తెలుసని, ప్రతిపక్షాలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపార రీత్యా గుడివాడ నుంచి అమెరికా వెళ్లిన రాము జన్మభూమిపై మక్కువతోనే వచ్చి సేవ చేస్తున్నారన్నారు. తెదేపా గెలుపే లక్ష్యంగా మేమంతా కలిసి పని చేస్తున్నాము. పదిమందిని వెంటేసుకుని ఇసుక, మట్టి, మద్యం మాఫియా, జూదం, క్యాసినోలు లాంటి వాటితో నీ బతుకు సాగుతోంది. మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. జగన్ దగ్గర ఎంత తీసుకొని వైకాపాలో చేరావో చెప్పాలని ప్రశ్నించారు. తెదేపాలో విభేదాలు సృషించడానికి ఎన్ని కుట్రలు చేసినా ఎవరూ నీ జిమ్మిక్కులకు పడిపోము, రానున్న ఎన్నికల్లో నీకు ఓటమి తప్పదు జాగ్రత్త అని తెలిపారు. తెదేపా, జనసేన ఉమ్మడి అభ్యర్థి వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!