logo

వైకాపా నాయకుడి నోటి దురుసు

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.

Published : 05 May 2024 02:52 IST

కృష్ణలంక: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది. 18వ డివిజన్‌కు చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలు శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా కార్యకర్త పరికపాటి మహాలక్ష్మి సైకిల్‌ గుర్తుకే ఓటేయాలంటూ కరపత్రాల పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో వైకాపా వారు ర్యాలీగా అటువైపు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక వైకాపా నాయకుడైన కుమ్మరి నాగేశ్వరరావు మహిళా కార్యకర్తను అసభ్య పదజాలంతో దూషించడంతో ఆమె నొచ్చుకున్నారు. స్థానిక తెదేపా నాయకులతో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అకారణంగా తనను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని