logo

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా రామ గంగాధర్‌

హిందూస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నూతన కమిషనర్‌గా దోర్నాసుల రామ గంగాధర్‌ నియమితులయ్యారు.

Published : 05 May 2024 02:54 IST

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే : హిందూస్థాన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నూతన కమిషనర్‌గా దోర్నాసుల రామ గంగాధర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం దిల్లీలోని ప్రధాన కార్యాలయం నుంచి విజయవాడలోని కమిషనర్‌ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ను ప్రవేశపెట్టి.. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రామగంగాధర్‌ పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని