logo

మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు

అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు.

Published : 05 May 2024 02:55 IST

ప్రజలకు నమస్కరిస్తున్న రవీంద్ర

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు.శనివారం ఆయన నగరంలోని గిలకలదిండి, బందరు, మల్కాపట్నం, ఇంగ్లీషుపాలెంతోపాటు మండల పరిధిలోని గరాలదిబ్బ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.   ప్రజలు అడుగడుగునా ఆయనకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి, నుదుట తిలకం దుద్ది ఆశీర్వదించారు. రవీంద్ర మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా నాయకులు మాయమాటలు చెప్పి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌-6 పథకాలతోపాటు మ్యానిఫెÆస్టోలోని అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు.ప్రజలందరూ ఎంపీ ఓటు గాజుగ్లాసు, ఎమ్మెల్యే ఓటు సైకిల్‌పై వేసి ఆశీర్వదించాలని కోరారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని