సెటిల్మెంట్లకు అడ్డాగా భవానీ ద్వీపం
నాడు: తెదేపా ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందింది. ప్రకాశం బ్యారేజి, భవానీ ద్వీపం వేదికగా తరచుగా వివిధ రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను పర్యాటక నిర్వహించేది.
నాడు: తెదేపా ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందింది. ప్రకాశం బ్యారేజి, భవానీ ద్వీపం వేదికగా తరచుగా వివిధ రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను పర్యాటక నిర్వహించేది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చి వీక్షించే వారు. కృష్ణానదీ తీరం వెంబడి పున్నమి, దుర్గా, భవానీఘాట్లు వీక్షకులతో కిటకిటాలాడేవి.
నేడు: వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలకు పూర్తిగా స్వస్తి పలికింది. ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి పెట్టకపోవడం, నిధులు కేటాయింపులు చేయకపోవటంతో కార్యక్రమాల నిర్వహణ మరుగున పడింది. నదీతీర ప్రాంతం కళావిహీనంగా మారింది.
భవానీపురం, న్యూస్టుడే: పర్యాటక శాఖ ఆధీనంలో భవానీపురం హరిత హోటల్, భవానీ ద్వీపం నడుస్తున్నాయి. అందులో ఉన్న కాటేజీలను అద్దెకు ఇస్తుంటారు. కాటేజీలు రాజకీయ నాయకులకు అడ్డాగా మారాయి. పర్యాటక శాఖ బోర్డు డైరెక్టర్లు పలువురు వారి అనుచరులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు వాటిలో సెటిల్మెంట్లు చేస్తుంటారు. కొందరు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సైతం అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కనీసం గదుల అద్దె కూడా చెల్లించకుండా రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయానికి గండి పడుతోంది. కొన్ని గదులైతే వారి కోసమే కేటాయించి ఉంచుతున్నారు. సందర్శకులు ఎవరైనా గదుల కోసం వెళ్తే కేటాయించే పరిస్థితి ఉండటం లేదు.
ఉన్నతాధికారుల సహకారం...
రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు గదులు తీసుకోవడం, వారి కార్యకలాపాలకు వినియోగించుకోవటం చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది.
పర్యాటక శాఖ ఉన్నతాధికారులు కొందరు అలాంటి నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. కొందరు విశ్రాంత ఉద్యోగులు పర్యాటకశాఖలో తిరిగి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారు సైతం రోజుల తరబడి గదులను వినియోగించుకుంటున్నారు. వారి శాశ్వత నివాసాలుగా వాడుకుంటున్నారు. పర్యాటకశాఖకు పెద్ద ఎత్తున గండిపడుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
నాడు ఎన్నో కార్యక్రమాలు..
తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఎఫ్1హెచ్2ఓ బోటు పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఆ జరిగాయి. నావికా విన్యాసాలు అంటే విశాఖపట్నం గుర్తుకు వస్తుంది. అలాంటి నావికా విన్యాసాలను సైతం కృష్ణానదిపై నిర్వహించారు. వీటితో పాటు ఆకాశంలో దూసుకుపోయే ఎయిర్క్రాఫ్ట్లతో ఎయిర్షో నగర వాసులను ఎంతగానో అలరించింది. కృష్ణానదిపై సీప్లేన్ దూసుకెళ్లింది. యోగా, అతిపెద్ద పూతరేకుల తయారీ, ఫుడ్ఫెస్టివల్స్ వంటివి నిర్వహించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మరుగున పడ్డాయి. ఈ అయిదేళ్లలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఒక్క కార్యక్రమమూ నిర్వహించలేదు.
కొంతకాలం కిందట ఓ మంత్రి అనుచరులు పున్నమి హోటల్లోని గదుల్లోనే కొన్ని రోజుల పాటు బస చేశారు. పర్యాటక శాఖకు ఎలాంటి అద్దె చెల్లించకుండా వారి సెటిల్మెంట్లు, ఇతర కార్యకలాపాలు నిర్వహించారు. గదుల్లోనే మద్యం తాగారు. జూదంతోపాటు ఇతర కార్యక్రమాలు కొనసాగించారు.
ఏపీటీడీసీ బోర్డు సభ్యులు కొందరు హరిత హోటల్ గదుల్లోనే రోజుల తరబడి తిష్టవేశారు. పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పలేదు. పర్యాటక శాఖ సిబ్బంది వారికి రాచమర్యాదలు చేశారు.
హరిత హోటల్, భవానీ ద్వీపంలో పని చేసే పర్యాటక శాఖ సిబ్బంది ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నివాసాల్లో పనులు చేస్తున్నారు. వారికి పర్యాటక శాఖ నుంచి జీతం ఇస్తున్నారు. వారి నివాసాల్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నుంచే భోజనాలు, అల్పాహారం, అన్నీ వెళ్తుంటాయి. తద్వారా పర్యాటక శాఖ ఆదాయానికి గండిపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..