మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
ఎన్నికల వేళ.. పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా సిద్ధం చేసిన భారీ తాయిలాలు మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాయి. మంత్రి జోగి రమేష్ ఎన్నికల బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన సోదాలు
ఘటనపై కేసు నమోదు
పోలీసులు స్వాధీనం చేసుకొన్న చీరల పెట్టెలు
పెనమలూరు, న్యూస్టుడే: ఎన్నికల వేళ.. పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా సిద్ధం చేసిన భారీ తాయిలాలు మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాయి. మంత్రి జోగి రమేష్ ఎన్నికల బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోరంకి ఏవీఎం గార్డెన్స్లోని ఓ ఇంటిపై మంగళవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. గృహాపకరణాలు, పార్టీ జెండాలు, తోరణాలు, బ్యానర్లు, ప్లాస్కులు, హాట్బాక్సులు వంటి 22 రకాల వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 476 చీరలు, 192 ప్లాస్కులు, 150 ఫ్రెష్మీల్స్ సెట్బాక్సులు, మిల్టన్ థర్మోవేర్ హాట్బాక్సులు 29 బ్యాగ్లు, పరాస్ హోమ్ వేర్ హాట్పాట్ బాక్సులు 46, వైకాపా గుర్తులు కలిగిన ప్యాంటు, షర్టులున్న 41 బాక్సులు, 90 స్టేషనరీ బ్యాగులు ఉండగా మిగతావి వైకాపా జెండాలు, తోరణాలు, బ్యానర్లు ఉన్నాయి. వీటిని భద్రపరిచిన ఇల్లు మండవ సతీష్దిగా పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.5.90 లక్షలుగా అంచనా వేశారు. ఈ ఇంటిని గత ఫిబ్రవరిలో నెలకు రూ.10 వేలు అద్దె చెల్లించే ఒప్పందంతో తీసుకొన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మనో జ్ అనే వ్యక్తి ఈ ఇంటిని అద్దెకు తీసుకొన్నట్లు తెలుసుకున్నారు. ఇంటి యజమాని నుంచి సేకరించిన మనోజ్ ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తుండగా అతని నుంచి ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటి యజమాని తల్లి సమక్షంలో పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి ఆయా వస్తువులను పోలీసులు, ఫ్లయింగ్స్క్వాడ్ అధికారులు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో మనోజ్..: ఇంటిని అద్దెకు తీసుకొన్న మనోజ్పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అతడు గత నాలుగున్నర ఏళ్లగా తాడిగడప మున్సిపాలిటీలో గుత్తేదారుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోరంకి వైకాపాలో ఇతను కొంతకాలంగా చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇతను పోరంకిలో నివసిస్తున్నాడా? లేక ఇతర ప్రాంతంలో నివసిస్తున్నాడా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మనోజ్ ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది తెలుసుకొనే ప్రయత్నంలో పోలీసులున్నారు. పరారీలో ఉన్న మనోజ్ కోసం పోలీసులు వేటాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు