నాలుగేళ్లుగా నాన్చారెందుకని?
ఏం చేశారు?: ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వేదికలపై ఎమ్మెల్యే కొడాలి నాని బాకా ఊదారు. ప్రస్తుతం ప్రచార వాహనాల్లో ఆడియో, వీడియోల్లోనూ ఇదే ఉపన్యాసం ప్రసారం చేస్తున్నారు.
పేదల సొంతింటి కల సాకారంలో కొడాలి విఫలం
లబ్ధిదారులు నిలదీస్తున్నా స్పందించని వైనంఏం చెప్పారు?
గుడ్లవల్లేరు కాలనీలో రోడ్ల పరిస్థితి ఇదీ..
ఏం చేశారు?: ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వేదికలపై ఎమ్మెల్యే కొడాలి నాని బాకా ఊదారు. ప్రస్తుతం ప్రచార వాహనాల్లో ఆడియో, వీడియోల్లోనూ ఇదే ఉపన్యాసం ప్రసారం చేస్తున్నారు.
ఏం చేశారు?: పట్టణంతోపాటు మండలాల్లో గ్రామాలకు దూరంగా లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గృహ నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇంకా ఎంతో మంది లబ్ధిదారులున్నా స్థలాలు కేటాయించలేదు.
న్యూస్టుడే, గుడివాడ గ్రామీణం, గుడ్లవల్లేరు: భూసేకరణ లోపభూయిష్టంగా చేయడం వల్ల పేదల సొంతింటి కల నెరవేరలేదు. పల్లపు ప్రాంతాల్లో, గుంతలుగా మిగిలిన పొలాలు, కాలువ అవతల స్థలాల్లో, చెత్త కేంద్రాల వద్ద స్థలాలు సేకరించడంతో వాటిలో ఇళ్లు ఎలా నిర్మించాలని లబ్ధిదారులు ఆదిలోనే అధికారులను నిలదీశారు. దీంతో నియోజకవర్గంలో 83 లేఔట్లలో 24 లేఔట్లు రద్దు చేశారు. లేఔట్లు వేసి నాలుగేళ్లయినా మౌలిక సదుపాయాలు లేక ఇళ్లు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇళ్లు కట్టకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటామంటూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో బెదిరించడంతో కొందరు ముందుకొచ్చారు. ఆర్థిక స్తోమత లేక వారిలో కొంత మంది మధ్యలోనే ఆపేశారు.
వివిధ కారణాలతో రద్దు చేసిన లేఔట్లు
గుడివాడ మండలంలో శేరీ గొల్వేపల్లి, గుంటాకోడూరు, కల్వపూడి అగ్రహారం, సైదేపూడి, చౌటపల్లి, కొత్త చౌటపల్లి, వలివర్తిపాడు, తటివర్రు గ్రామాల్లో, నందివాడ మండలం జనార్దనపురం-1, గండేపూడి, పొణుకుమాడు, రామాపురం, శంకరంపాడు, పెదవిరివాడ, దండిగానపూడి, ఇలపర్రు-1, వెన్ననపూడి, కుదరవల్లి, జనార్దనపురం-2, ఇలపర్రు-2, పోలుకొండ, తమిరిశ, గుడ్లవల్లేరు, వెణుతురుమిల్లి లేఔట్లను వివిధ కారణాలతో రద్దు చేశారు. దీంతో ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలం రాలేదు.
రుణాలెందుకు రావట్లేదు నానీ?
గుడివాడ మండలంలో 24 లేఔట్లలో 1205 మందికి స్థలాలివ్వగా వారిలో ఇప్పటికి వరకు 828 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. అర్బన్లో 7007 మందికి పట్టాలివ్వడానికి స్థలం సిద్ధం చేశారు కానీ 4039 మందికి మత్రామే గృహనిర్మాణ రుణ మంజూరు చేశారు. ఇక్కడ చాలా స్థలాలు ఖాళీగా ఉన్నా లబ్ధిదారులకు కేటాయించలేదు. నందివాడ మండలంలో 672 మందికి ఇళ్ల పట్టాలివ్వగా 184 మందికి మాత్రమే రుణం ఇచ్చారు. 488 మంది అర్హులకు అన్యాయం జరిగింది. గుడ్లవల్లేరు మండలంలో 2795 మందికి ఇళ్లపట్టాలు అందించగా వారిలో 1995 మందికి గృహనిర్మాణ రుణాలు మంజూరు కాకపోవడంతో ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు. అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే నాని రుణాలు ఇప్పించకపోవడానికి కారణమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
అర్హత ఉన్నా ఇవ్వలేదు
అర్హత ఉన్నా నాకు పట్టా ఇవ్వలేదు. గతంలో వలివర్తిపాడు లేఔట్లో నీకు స్థలం ఇచ్చాం కానీ అది కోర్టులో ఉందని చెప్పారు. మిగతావారందరికీ మల్లాయపాలెంలో స్థలాలిచ్చి నాకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారు. వృద్ధాప్యంలో ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారు.
రేమల్లి సుశీల, వలివర్తిపాడు
స్థలం చూపించ లేదు
వలివర్తిపాడు దళితవాడ పక్కన ప్లాట్లు కేటాయించినట్లు పట్టాలిచ్చారు. కానీ నేటి వరకూ స్థలం పొజిషన్ చూపించలేదు. లబ్ధిదారుగా చూపించినా స్థలం చూపకపోవడం వల్ల మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఓ లబ్ధిదారు
శ్మశానం పక్కన ఇల్లు కట్టలేం
శ్మశానం పక్కన ఇళ్ల స్థలాలిచ్చారు. అక్కడ ఎల్లు కట్టలేని పరిస్థితి. లేఔట్లో ఇంకా రహదారులు కూడా వేయలేదు. గృహ నిర్మాణ సామగ్రి తీసుకెళ్లేందుకు కూడా వీలు లేదు.
విజయలక్ష్మి, అంగలూరు
- గుడ్లవల్లేరు మండలం అంగలూరు, పెంజెండ్ర, కౌతవరం, డోకిపర్రు తదితర కాలనీల్లో మట్టిరోడ్లే దిక్కు. గోతులు, ఎత్తు పల్లాలతో ఉండడంతో వర్షాకాలంలో బురదతో నానా అగచాట్లు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు