Somu Veerraju: ఉద్యోగులను రోడ్లమీదికి తెచ్చిన ఘనత జగన్దే: సోము వీర్రాజు
ఏపీ ప్రభుత్వం ఆర్థికలేమితో సతమతమవుతోందని.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని భాజపా
ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా భాజపా ‘నిరసన దీక్ష’
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆర్థికలేమితో సతమతమవుతోందని.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉద్యోగులను రోడ్లమీదికి తెచ్చిన ఘనత సీఎం జగన్దేనని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా.. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా విజయవాడలో భాజపా నేతలు ‘నిరసన దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటానికి భాజపా పూర్తి మద్దతు పలుకుతోందని చెప్పారు. ఎర్రచందనాన్ని ఇష్టానుసారంగా అమ్ముకొంటున్నారని ఆరోపించారు. ఆదాయవనరులన్నీ అధికార పార్టీ పరం అయ్యాయని.. ప్రజలకు మాత్రం అప్పులు మిగిలాయి సోము వీర్రాజు ఆక్షేపించారు.
భాజపా ముఖ్యనేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని వ్యవస్థలు, సంస్థలను సీఎం జగన్ నాశనం చేశారని ఆరోపించారు. మైనింగ్, లిక్కర్ వ్యాపారం మాత్రం లాభాల్లో నడుస్తోందని. అధికార పార్టీ నాయకుడిని విమర్శిస్తే అరెస్ట్ చేస్తున్నారని.. దోపిడీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ గుడివాడలో క్యాసినో జరగలేదని బుకాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకే జగన్ అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. అడగనిది చేయడం.. అడిగింది చేయకపోవడం జగన్ నైజమని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం