Andhra News: పవన్‌.. జనసేనను తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు: ద్వారంపూడి

పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి

Updated : 15 Mar 2022 16:27 IST

అమరావతి: పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తన జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘పవన్‌ కల్యాణ్‌ నిన్న ఇప్పటంలో పెట్టిన సభ పార్టీ ప్రమోషన్‌ కోసం కాదు.. పార్టీని అమ్ముకోవడానికి పెట్టుకున్న సభ. నా సభకు ఇంత మంది హాజరయ్యారు. నాకెంత ప్యాకేజీ ఇస్తారని చెప్పడం కోసమే పెట్టిన సభ. నా జోలికొస్తే ఊరుకోను.. నేను అంత శాంతిపరుడినైతే కాను. సినిమాల్లో పది మందిని కొట్టినంత మాత్రాన హీరో కాదు. రాజకీయాల్లో హీరోయిజం వేరు. జనసేన నాయకులందరూ మీ నాయకుడిని ప్రశ్నించండి. మనం కలిసి పోటీ చేస్తామా? విడిగా పోటీ చేస్తామా?అని ప్రశ్నించండి. పవన్‌కు చేతనైతే ఒంటరిగా వచ్చి పోరాడాలి. అలాగైతేనే రాష్ట్ర ప్రజలు హీరోగా గుర్తిస్తారు’’ అని ద్వారంపూడి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని