‘నాడు’ రూ.లక్షలు ఖర్చు పెట్టారు..
రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పాఠశాలకు రూ.లక్షల నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించింది. అంత ఖర్చు చేసిన ప్రాథమిక పాఠశాలలను ప్రస్తుతం ప్రభుత్వం విలీనం చేయడంతో రూ.లక్షల ప్రజాధనం వృథాగా మారే అవకాశం
‘నేడు’ విలీనం చేశారు
ధర్మవరం, తాడిమర్రి, నల్లచెరువు, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పాఠశాలకు రూ.లక్షల నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించింది. అంత ఖర్చు చేసిన ప్రాథమిక పాఠశాలలను ప్రస్తుతం ప్రభుత్వం విలీనం చేయడంతో రూ.లక్షల ప్రజాధనం వృథాగా మారే అవకాశం ఉంది. విలీనం చేస్తున్న పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెబుతున్నా వాటికి ఒక గది ఉంటే చాలని, మరి మిగిలిన గదుల సంగతి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
విలువైన వస్తువుల మాటేంటి..?
నాడు- నేడు మొదటి విడతలో అధికారులు ఎంపిక చేసిన ప్రతి పాఠశాలకు రూ.10 లక్షలకు పైగా నిధులు మంజూరు చేశారు. వాటితో మరుగుదొడ్లు, ఆర్వో నీటి ప్లాంట్, విలువైన ఫర్నీచర్, ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. విలువైన సామగ్రిని వినియోగించకపోతే కొన్ని రోజులకు పాడవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విలీనం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇలా రూ.లక్షల ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
నల్లచెరువు మండలం తవళంమర్రి ప్రాథమిక పాఠశాలకు నాడు- నేడు పథకంలో రూ.18 లక్షలు ఖర్చు చేశారు. ఈ పాఠశాలలోని 3,4,5 తరగతులను తవళంమర్రి ఉన్నతపాఠశాలలో విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం 12 మంది విద్యార్థులు ఉన్నారు. బడిలో మొత్తం ఐదు గదులు ఉండగా మూడు గదులను మూసివేశారు. మిగిలిన రెండు గదుల్లో 1,2 తరగతులు కొనసాగుతున్నాయి.
తాడిమర్రిలోని ప్రాథమిక పాఠశాలకు (బంగ్లా బడి) నాడు- నేడు పథకం కింద రూ.18 లక్షలు మంజూరు కాగా వాటితో పనులు చేయించారు. గతేడాది బడిలో 1 నుంచి 5 తరగతుల్లో 96 మంది విద్యార్థులు చదివారు. ప్రస్తుతం తాడిమర్రి ఉన్నతపాఠశాలలో విలీనం అవడంతో ఇప్పుడు 1, 2 తరగతుల్లో 20 మందే ఉన్నారు. వీరిలో కూడా కొందరు టీసీలు తీసుకుని ప్రైవేట్ పాఠశాలలో చేరేందుకు సిద్ధమవుతుంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులను బతిమాలి పాఠశాలలోనే కొనసాగేలా చేశారు. మూడు గదులకు ఉపాధ్యాయులు తాళాలు వేశారు.
విలీనంలోకి 481 పాఠశాలలు..
ఉమ్మడి జిల్లాలో 481 ప్రభుత్వ పాఠశాలలు విలీనం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,662 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో మొదటి విడతలో నాడు-నేడు పథకానికి 1,294 పాఠశాలలను ఎంపిక చేసి రూ.320 కోట్లను ఖర్చు చేశారు. కొన్ని మండలాల్లో విలీనం అవుతున్న పాఠశాలలను రెండో విడతలో నాడు-నేడుకు ఎంపిక చేశారు. 1, 2 తరగతులు ఉన్న పాఠశాలలకు అధికారులు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు లేని పాఠశాలలకు రూ.లక్షల నిధులు మంజూరు చేసినా ఏం ఉపయోగముంటుందని, అభివృద్ధి అంటే ఏళ్ల తరబడి అందరికీ ఉపయోగ పడేలా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు - మీనాక్షి, డీఈవో, శ్రీసత్యసాయి జిల్లా
విలీనంతో మిగిలిన పాఠశాల తరగతి గదులపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. పాఠశాలలో ఉన్న విలువైన వస్తువులు నిరుపయోగంగా ఉండకుండా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారమిచ్చినా.. నిర్లక్ష్యమే అడుగడుగునా..!
[ 27-04-2024]
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. రచ్చ సంగతి దేవుడెరుగు వారు నివాసముంటున్న ప్రాంతాలనూ గాలికొదిలేశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఉమ్మడి అనంత జిల్లాలో 14 సీట్లకుగాను 12 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఇక తమ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని కలలుగన్న ప్రజల ఆశలు ఐదేళ్లుగా నిరాశలయ్యాయి. -
‘అరాచక పాలన అంతం.. కూటమి పంతం’
[ 27-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా, భాజపా జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య పేర్కొన్నారు. -
రూ.50 లక్షలు.. నీళ్ల పాలు
[ 27-04-2024]
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బుక్కరాయసముద్రం వాసుల పాలిట శాపంగా మారింది. ఈ మేజరు పంచాయతీలో 35 కాలనీల్లో 30 వేల జనాభా ఉంది. -
లోక్సభకు 21... అసెంబ్లీకి 136
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టంలో రెండో ప్రక్రియగా భావించే పరిశీలన సజావుగా ముగిసింది. ఎక్కడా పెద్దగా వివాదాలు, అభ్యంతరాలు చోటు చేసుకోలేదు. చిన్నాచితకా మౌఖిక ఫిర్యాదులు మినహా ఏ సమస్య తలెత్తలేదు. -
నెగ్గేందుకు సిగ్గులేకుండా బరితెగింపు
[ 27-04-2024]
ఓటర్లకు డబ్బు చేరవేసేందుకు అధికార వైకాపా ముందస్తుగా బరితెగించింది. తమ పార్టీ నాయకులపై ఎన్నికల యంత్రాంగం పూర్తి నిఘా ఉంటుందన్న అనుమానంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. -
పెద్దలకు తారురోడ్డు.. పేదలకు మోకాలడ్డు!
[ 27-04-2024]
ఇక్కడ కన్పిస్తున్న పై చిత్రంలో పెద్దలు వెళ్లే రాచమార్గం.. దానిపక్కనే పేదలు వెళ్లే దారి ఉంది. నగరంలోని జన్మభూమి రోడ్డు నడిమి వంక నుంచి ప్రారంభమై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా కోవూరునగర్ ప్రధాన రోడ్డులోకి చేరుతుంది. -
భవన నిర్మాణ కార్మిక జీవనం.. జగన్ పాలనలో ఛిద్రం
[ 27-04-2024]
రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న ఆన్లైన్ ఇసుక విధానంతో భవన నిర్మాణ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఐదేళ్ల వైకాపా పాలన వారి బతుకులను ఛిద్రం చేసింది. -
చేనేతలను ఆదుకుంటాం: నిమ్మల కిష్టప్ప
[ 27-04-2024]
తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. -
పయ్యావుల కేశవ్ ప్రచారంలో వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
[ 27-04-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా నాయకులు గొడవలకు తవిచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరహా చర్యలకు మండలంలోని కాలువపల్లిలో శుక్రవారం వైకాపా కార్యకర్తలు పూనుకున్నారు. -
వైకాపా మోసపూరిత మాటలు నమ్మొద్దు: సునీత
[ 27-04-2024]
గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి ఎంత తప్పుచేశారో మీరే ఆలోచించాలి. ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు. -
సొంత చెల్లి చీరపైనా దిగజారుడు మాటలా?
[ 27-04-2024]
ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. -
నిలువ నీడేదీ జగన్?
[ 27-04-2024]
అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. -
‘వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడదాం’
[ 27-04-2024]
వైకాపా నాయకులు ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, వారి అరాచక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, రాయదుర్గం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం..
[ 27-04-2024]
ప్రజల నుంచి పన్ను కట్టించుకొంటున్నారే తప్పా అభివృద్ధి చేయలేకపోయారని, తనకు అవకాశం కల్పిస్తే కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 27-04-2024]
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు. -
నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ
[ 27-04-2024]
తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. -
లోక్సభకు 9, అసెంబ్లీకి 45 నామపత్రాల తిరస్కరణ
[ 27-04-2024]
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా హిందూపురం పార్లమెంటు స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామపత్రాలను అధికారులు పరిశీలన చేశారు. -
28న ఏపీసెట్
[ 27-04-2024]
సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
[ 27-04-2024]
ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్న 4వ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. -
ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-04-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు