సొంత చెల్లి చీరపైనా దిగజారుడు మాటలా?
ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఆజాద్నగర్ (అనంతపురం), న్యూస్టుడే: ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ అవినాష్రెడ్డి వైపు చూపిస్తోంటే.. జగన్ మాత్రం అవినాష్ చిన్న పిల్లవాడని వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని నీలం రాజశేఖర్రెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ పట్ల సానుభూతిగా మాట్లాడటం కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు వివేకాను చంద్రబాబు చంపించారని తప్పుడు మాటలు మాట్లాడిన జగన్.. ఐదేళ్లు అధికారంలో ఉన్నా వివేకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వచ్చే మే నెలలో సామాజిక పింఛన్లు సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు. ఒకవేళ అలా చేయని పక్షంలో తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. రాజ్యాంగ వ్యవస్థలంటే నమ్మకం లేని భాజపా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారన్నారు. పదేళ్ల భాజపా పాలనలో శాసన, న్యాయవ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేశారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, అర్బన్ ఎమ్మెల్యే ఇండియా కూటమి అభ్యర్థి జాఫర్, ఎంపీ అభ్యర్థి మల్లికార్జున సీపీఐ నాయకులు రాజారెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత మనవడినంటావు..గేట్లు గ్రీజుకూ డబ్బుల్లేవంటావు!
[ 07-05-2024]
మా అమ్మ వాళ్లది పెద్దపప్పూరు మండలం.. అనంతపురం జిల్లా మనవడిని అన్నావు.. సెంటుమెంట్తో ఓట్లు వేయించుకున్నావు. అదే పెద్దపప్పూరు మండలంలోని ప్రాజెక్టులను గాలికి వదిలేశావు. -
9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
[ 07-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. -
కలిసి పనిచేయండి.. విజయం సాధించండి
[ 07-05-2024]
అనంత నగరం ఆర్.కన్వెన్షన్ హాలులో సోమవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. -
బహిరంగంగా డబ్బు పంపిణీ
[ 07-05-2024]
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది. -
నిధులు, నీళ్లు ఇవ్వకుండా.. ఊళ్లెలా నిర్మిస్తావు జగన్
[ 07-05-2024]
ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. -
చెరువులపై వైకాపా నాయకుల పంజా
[ 07-05-2024]
కరవునేల కదిరి ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు కబ్జా రాయుళ్ల కళ్లు చెరువులపై పడ్డాయి. -
‘సీఎం జగన్ ఓ పిచ్చోడు’
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ పిచ్చోడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుతం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ఆరోపించారు. -
ఎన్నికల ముందు అధికారిక తాయిలాలు
[ 07-05-2024]
ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది. -
తెదేపా ప్రచారంలో తప్పెట కొట్టాడని..
[ 07-05-2024]
తెదేపా ఎన్నికల ప్రచారంలో తప్పెట కొట్టాడని ఓ దళితుడిని వైకాపా సర్పంచి మరిది చితకబాదాడు. -
తాగునీరు కలుషితం.. 25 మందికి అస్వస్థత
[ 07-05-2024]
గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన 25 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. -
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని మాజీ వాలంటీరుపై దాడి
[ 07-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని పట్టణంలోని 19 వార్డు కౌన్సిలర్ భాగ్యమ్మ, ఆమె కుమారుడు మారుతి పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ వాలంటీరు నళిని ఆరోపించారు. -
వైకాపా ఓటమి తథ్యం : పరిటాల సునీత
[ 07-05-2024]
రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఓటమి కోసం వైకాపా నాయకులంతా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి : మందకృష్ణమాదిగ
[ 07-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు, దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. -
అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 07-05-2024]
తాగు, సాగు నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. -
సాగు, తాగునీరు అందిస్తాం: అమిలినేని
[ 07-05-2024]
కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చి రైతులకు సాగు నీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెదేపా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
శింగనమలలో సుర్రుమన్న సూరీడు
[ 07-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో సోమవారం శింగనమల మండలంలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి